English | Telugu

పాట‌, ఫైట్ చేస్తున్న ర‌జ‌నీకాంత్‌

లాస్ట్ ఇయ‌ర్ సంక్రాంతికి అన్నాత్తే సినిమాతో జ‌నాల ముందుకు వ‌చ్చారు ర‌జ‌నీకాంత్‌. ఇప్పుడు జైల‌ర్ సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయ‌ర్ సంక్రాంతికి విజ‌య్‌తో బీస్ట్ సినిమాను రూపొందించిన నెల్స‌న్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు డైర‌క్ట‌ర్‌. దాదాపు 75 శాతం షూటింగ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. జాకీ ష్రాఫ్‌, మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, ర‌మ్యకృష్ణ‌, త‌మ‌న్నా, సునీల్‌, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్స్ తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్. పాట‌ల‌ను కూడా అక్క‌డి అంద‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రిస్తున్నారు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ కి సంబంధించి కొన్ని ఇంట్ర‌స్టింగ్ ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఆ ఫొటోల‌లో చాలా వాహ‌నాలు క‌నిపిస్తున్నాయి. వాట‌న్నిటిని బ‌ట్టి చూస్తే ఛేజింగ్ సీక్వెన్స్ తెర‌కెక్కిస్తున్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది.

జైల‌ర్ సినిమాలో తాను చిన్న కేర‌క్ట‌ర్ చేస్తున్నాన‌ని అన్నారు శివ‌రాజ్‌కుమార్‌. ర‌జ‌నీకాంత్ సినిమాలో న‌టిస్తారా అని అడుగుతూ పిలుపువ‌స్తే, కాద‌నే ధైర్యం ఎవ‌రికీ ఉండ‌ద‌ని, ఎంత‌పెద్ద న‌టుడైనా సూప‌ర్‌స్టార్ సినిమాలో చిన్న కేర‌క్ట‌ర్ చేయ‌డానికి రెడీగా ఉంటార‌ని అన్నారు శివ‌రాజ్ కుమార్‌. ఈసినిమాను దీపావ‌ళికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అన్నాత్తే త‌ర్వాత ర‌జ‌నీకాంత్ సినిమాల‌కు దూర‌మవుతార‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగింది అప్ప‌ట్లో. అయితే వాట‌న్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఈ ప్రాజెక్టును ఓకే చేశారు ర‌జ‌నీకాంత్‌. జైల‌ర్‌లో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు ర‌జనీకాంత్‌. ఖాకీ చొక్కాలో త‌లైవ‌ర్ ప‌వ‌ర్ చూపించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారంటున్నారు ఫ్యాన్స్. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల కానుంది ఈ సినిమా.

మ‌రోవైపు పెద్ద కూతురు తెర‌కెక్కిస్తున్న సినిమాలోనూ గెస్ట్ రోల్ చేస్తున్నారు ర‌జ‌నీకాంత్‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.