English | Telugu

ఈ కొత్త దర్శకుడి కోసం కర్చీఫ్‌లు వేస్తున్నారు!

ఒక డైరెక్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ఆయా దర్శకులకు కర్చీఫులు వేయడం నిర్మాతలకు, హీరోలకు తెలుగులో చాలా సహజం. కానీ ఒక డైరెక్టర్ తీసిన సినిమా ఇంకా విడుదల కాకుండానే కేవలం ట్రైలర్ చూసి ఆ దర్శకుడిని లైన్ లో పెట్టాలని భావిస్తూ ఉండడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. కానీ ఇది వాస్తవం. విషయానికి వస్తే ప్రస్తుతం నాని దసరా అని చిత్రం చేస్తున్నారు. ఊర మాసివ్ అవతార్‌లో నాని కనిపిస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. సుకుమారు శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన దగ్గర నుంచి ఈ మూవీలో నాని లుక్, మేకోవర్ పై చర్చ జరుగుతుంది. ర‌గ్గ్ఢ్ లుక్ లో నాని కనిపించడంతో అంత షాక్ అవుతున్నారు.

కీర్తి సురేష్ డీగ్లామర్ పాత్రలో కనిపిస్తోంది. మార్చి 30న సినిమా విడుదల కావాల్సి ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. టీజర్ లో యాక్షన్ ఘట్టాలు, నాని పలికిన సంభాషణలు, ఫైనల్ షాట్‌లో నాని తన చుట్టూ ఉన్న వారిని తెగ నరికి నోటితో కత్తి పట్టుకొని దానికి అంటిన రక్తాన్ని వీర తిల‌కంగా పెట్టుకుంటున్న తీరు ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేస్తుంది. దీంతో శ్రీకాంత్ ఓదోల గురించి ఎంక్వయిరీలు మొదలైపోయాయి. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని హీరోలు, నిర్మాత‌లు ఇప్పటినుంచే పోటీ పడుతున్నారు.

మొదటి చిత్రం విడుదల కాకుండానే ఆయన ముందు క్యూ కడుతున్నారు. టీజర్ వచ్చాక ఇది మరింత ఎక్కువగా అయింది. రా అండ్ ర‌గ్గ్డ్ గా ఈ సినిమా ఉండనుండ‌టంతో అందరూ శ్రీ‌కాంత్ ఓదెల గురించే మాట్లాడుతున్నారు. అడ్వాన్స్ ఇచ్చి రిజర్వ్ చేసుకునే పనిలో ఉన్నారు. టీజర్ కార్యక్రమంలో నాని శ్రీకాంత్ ఓదెల గురించి గొప్పగా చెప్పడమే కాకుండా వేరే లెవ‌ల్ లో ఎలివేషన్ ఇచ్చారు. దాంతో నిర్మాతలు, హీరోలు ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దగ్గర క్యూ కడుతున్నారు. మరి శ్రీకాంత్ ఓదెలా భవిష్యత్తు ఏమిటో మార్చి 30వ తేదీన గాని చెప్పలేం. దసరా సాధించబోయే విజయంపై ఈ యువ దర్శకుడి భవితవ్యం ఆధారపడి ఉంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.