English | Telugu

'పుష్ప-2' సీన్స్, డైలాగ్స్ లీక్.. థియేటర్స్ లో పూనకాలే!

దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో 'పుష్ప: ది రూల్' ఒకటి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కట్టిపడేశాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి లీకైన డైలాగ్ లు అంచనాలను అమాంతం పెంచేశాయి.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ అల్లు అర్జున్ పై స్పెషల్ వీడియోని షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో పుష్ప-2 సెట్స్ లో బన్నీ ఉన్న విజువల్స్ కూడా చూపించారు. అందులో దర్శకుడు సుకుమార్ సీన్ పేపర్స్ పట్టుకొని బన్నీతో మాట్లాడటం గమనించవచ్చు. స్క్రీన్ షాట్ తీసి చుస్తే, ఆ సీన్ పేపర్స్ లో ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. "కేశవకి హీరో సారీ చెప్పడం ఇష్టం లేదు.. 'నేను చూసేది పుష్పనేనా' అనుకుంటాడు" అని రాసుంది. మామూలుగా పుష్పరాజ్ ది తగ్గేదేలే అనుకునే స్వభావం. ఎవరికీ సారీ చెప్పే రకం కాదు. అలాంటి పుష్పరాజ్ సారీ చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే పేపర్ స్టార్టింగ్ లో "బాబు నీకు ఇష్టం వచ్చినట్టు చేస్కో.. మళ్ళీ లాస్ట్ లో వచ్చి నువ్వు చెప్పమంటేనే చెప్పాను అని నన్ను అనకు" అంటూ హీరో, హీరోయిన్ మధ్య సంభాషణలను గమనిస్తే.. శ్రీవల్లి కోసమే పుష్ప సారీ చెప్పాడు అనిపిస్తుంది. ఇక ఆ పేపర్ లో ఉన్న చివరి డైలాగ్ అయితే.. సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లేలా ఉంది. "ముందు అయితే నీకు, షెకావత్ కే గొడవ మచ్చా.. కానీ ఇప్పుడు సిండికేట్ కూడా ఇన్వాల్వ్ అయింది." అని పుష్పతో కేశవ అన్నట్లుగా ఉంది. ఈ డైలాగ్ ని బట్టి చూస్తే రెండో భాగంలో పుష్ప కేవలం షెకావత్ తోనే కాదు, సిండికేట్ తో కూడా తలపడబోతున్నాడని అర్థమవుతోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.