English | Telugu

16 కోట్లు చీటింగ్ కేసులో నిర్మాత‌ అరెస్ట్!

కొంద‌రు ఏ ప‌ని చేసినా త‌మ ప్ర‌మేయం లేకుండా వార్త‌ల్లో వ్య‌క్తులుగా ఉంటుంటారు. అలాంటి వారిలో త‌మిళ నిర్మాత ర‌వీంద్ర‌న్ చంద్ర‌శేఖ‌రన్ ఒక‌రు. ఈయ‌న మ‌హాల‌క్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న‌ప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యారు. అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకుంటే వైర‌ల్ కావ‌ట‌మేంట‌నే అనుమానం రావ‌చ్చు. ఆయ‌నేమో లావుగా ఉంటే అమ్మాయేమో నాజుగ్గా ఉంటుంది మ‌రి. అలా ఇద్ద‌రూ అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారారు. తాజాగా ఇప్పుడు ర‌వీంద్ర‌న్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. అందుకు కార‌ణం.. ఆయ‌న‌పై చీటింగ్ కేసు న‌మోదు కావ‌ట‌మే. ఓ బిజినెస్ మ్యాన్‌ను దాదాపు రూ.16 కోట్లు మోసం చేశార‌నే దానిపై ర‌వీంద్ర‌న్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.

వివ‌రాల్లోకి వెళితే.. 2020లో బాలాజీ అనే వ్యాపార‌వేత్త‌ను ర‌వీంద్ర‌న్ క‌లిశారు. చెత్త నుంచి ఎల‌క్ట్రిసిటీగా మార్చే ఓ ప్రాజెక్ట్‌ను తాను స్టార్ట్ చేస్తున్నాన‌ని అందులో డ‌బ్బులు ఇన్వెస్ట్ చేయాల‌ని కోరారు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ న‌చ్చ‌టంతో ర‌వీంద్ర‌న్‌కు రూ. 15.85 కోట్ల మొత్తాన్ని బాలాజీ అందించారు. డబ్బులు తీసుకున్న త‌ర్వాత ర‌వీంద్ర‌న్ ఎలాంటి బిజినెస్‌ను స్టార్ట్ చేయ‌లేదు. కొన్నాళ్లు వేచి చూసిన బాలాజీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సీసీబీ, ఈడీఎఫ్‌ల‌లో కేసు న‌మోదైంది. దొంగ డాక్యుమెంట్స్‌తో తాను వ్యాపారాన్ని ప్రారంభించిన‌ట్లు లాభ న‌ష్టాల‌ను చూపించిన‌ట్లు న‌మ్మించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు త‌ర్వాత ర‌వీంద్ర‌న్ చంద్ర‌శేఖ‌ర్ క‌నిపించ‌కుండా దాక్కున్నారు. చివ‌ర‌కు పోలీసులు అన్వేషించి ఆయ‌న్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్ర‌వేశ పెట్టారు. కేసుని ప‌రిశీలించిన కోర్టు ఆయ‌న‌కు జ్యూడిషియ‌ల్ క‌స్ట‌డీని విధించింది. ఈ విష‌యంపై ఇప్పుడు మ‌హాల‌క్ష్మి ఎలా రియాక్ట్ అవుతార‌నేది చూడాల‌ని నెటిజ‌న్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఆమె ఈ వ్య‌వ‌హారంపై ఎలా స్పందిస్తారో చూడాల‌ని ప‌లువురు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.