English | Telugu

వై.ఎస్‌.జగన్‌ని టార్గెట్‌ చేస్తున్న ‘రంగం’ హీరో, విలన్‌!

సినిమా రంగంలో ఎవరు ఎలాంటి క్యారెక్టర్స్‌ చెయ్యాల్సి వస్తుందో, వారి కెరీర్‌ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి వారు ఎప్పుడూ ఊహించని క్యారెక్టర్స్‌ చెయ్యాల్సి వస్తుంది. ఆ క్యారెక్టర్స్‌తోనే వారి కెరీర్‌ గ్రాఫ్‌ పెరిగిన సందర్భాలు కూడా ఉంటాయి. 2011లో అంటే దాదాపు 12 సంవత్సరాల క్రితం కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రంగం’ సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. అది అప్పట్లో పెద్ద హిట్‌ సినిమాగా నిలిచింది. జీవా, కార్తీక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అజ్మల్‌ అమీర్‌ విలన్‌గా నటించాడు. ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించిన అజ్మల్‌ ఆ తర్వాత రామ్‌గోపాల్‌వర్మ నేతృత్వంలో రూపొందిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంలో వై.ఎస్‌.జగన్‌ పాత్రలో నటించాడు.
తాజాగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలోనే రూపొందుతున్న ‘వ్యూహం’ చిత్రంలోనూ అజ్మల్‌ మరోసారి వై.ఎస్‌.జగన్‌గా కనిపించబోతున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ఆర్‌జివి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క ‘యాత్ర2’ చిత్రం షూటింగ్‌ కూడా జరుగుతోంది. 2019లో మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర’ చిత్రంలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిగా మమ్ముట్టి నటించారు. ఇప్పుడు ‘యాత్ర 2’లో వై.ఎస్‌.జగన్‌ పాత్రలో తమిళ్‌ హీరో జీవా నటిస్తున్నాడు.
ఇక్కడ విశేషం ఏమిటంటే ‘రంగం’ చిత్రంలో జీవా, అజ్మల్‌ మొదట్లో కాలేజ్‌ ఫ్రెండ్స్‌గా నటించినా ఆ తర్వాత జీవా హీరోగానూ, అజ్మల్‌ విలన్‌గానూ ఎస్టాబ్లిష్‌ అవుతారు. ఇప్పుడు ఒకేసారి షూటింగ్‌ జరుపుకుంటున్న రెండు చిత్రాల్లో వీరిద్దరూ వై.ఎస్‌.జగన్‌ పాత్రలే చేయడం విశేషమే అయినా కాకతాళీయం కూడా. ఎన్నికల ముందు విడుదలయ్యే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారు, ఇద్దరిలో ఎవరిని వై.ఎస్‌.జగన్‌గా అంగీకరిస్తారో వేచి చూద్దాం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .