English | Telugu

నెల్లూరు తెలుగు మాది

అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్(prashanth neel)ప్రస్తుతం ఎన్టీఆర్(ntr)సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.ఇటీవల పూజా కార్యక్రమాలతో అధికారకంగా ప్రారంభమయిన ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ ని జరుపుకుంటుంది.నెక్స్ట్ మంత్ నుంచి ఎన్టీఆర్ కాకుండా మిగతా నటినటులతో షూటింగ్ ని స్టార్టింగ్ చేయబోతున్నారని,ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా షూట్ లో జాయిన్ అవ్వబోతున్నాడనే వార్తలు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి.

ఇక ఇంత బిజీలోను ప్రశాంత్ నీల్ 'బఘీర'(bagheera)అనే సినిమాకి కథని అందించగా ప్రముఖ కన్నడ స్టార్ శ్రీ మురళి(sri murali)హీరోగా చేస్తున్నాడు.ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉగ్రంలో శ్రీ మురళినే హీరో.ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో శ్రీ మురళి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.శ్రీ మురళి భార్య పేరు విద్యా. ఈమె ప్రశాంత్ నీల్ కి స్వయానా సోదరి. తొమ్మిది సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న శ్రీ మురళి, విద్యా ఆ తర్వాత పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.విద్యా స్వస్థలం నెల్లూరు.దీంతో ఆమె కోసం శ్రీ మురళి తెలుగు కూడా నేర్చుకున్నాడు. ఇప్పటికి ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటూనే ఉంటారు.

ఇక బఘిర ఈ నెల 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా ప్రకాష్ రాజ్(prakash raj)అచ్యుత్ రాజ్,రామచంద్ర రాజు ముఖ్య పాత్రలో చేస్తున్నారు.హోంబులే ఫిల్మ్స్ పతాకంపై కేజీఎఫ్, సలార్ ని నిర్మించిన విజయ్ కిరాంగదుర్(vijay kirangadur) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.