English | Telugu

అదే డేట్‌కి ఫిక్స్ అయిన సలార్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి -ది బిగినింగ్, బాహుబలి-ది కంక్లూషన్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈయనకు ఇప్పుడు ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా బాగా గుర్తింపు ఉంది. కానీ బాహుబలి 2 భాగాల తర్వాత ఆయన నటించిన సాహూ రాధేశ్యామ్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో తదుపరి ప్రభాస్ చేయబోయే చిత్రం అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సాహో రాధేశ్యామ్ చిత్రాల పరాజయాలకు దీటుగా స‌లార్ సంచలనం సృష్టిస్తుందని వారు ఎంతో ఆశతో ఉన్నారు. అందునా ప్రశాంతినీల్ కేజీఎఫ్ ఫ్రాంచైజీ ద‌ర్శ‌కుడైన ప్ర‌శాంత్ నీల్ తో ఈ చిత్రం రూపొందుతూ ఉండ‌టంతో అంచ‌నాలు అంబ‌రాన్ని చుంబిస్తున్నాయి.

ఈ క్రేజీ కాంబోలో చిత్రం కే జి ఎఫ్ ఫ్రాంచైజీ తర్వాత ప్రశాంత్ నీళ్లు చేస్తున్న తొలి చిత్రం కావడం విశేషం కాగా కేజిఎఫ్ సినిమా ఫ్రాంచైజీని నిర్మించిన హోం భలే ప్రొడక్షన్స్ లోనే సలార్ కూడా రూపొందుతోంది. అలా చూసుకుంటే హోం భలే సంస్థ తెలుగులో తీస్తున్న తొలి చిత్రం సలారే కానుంది. కాగా ఈ చిత్రం షూటింగు దాదాపు పూర్తయిందని సమాచారం. మిగిలిన షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ప్రొడ‌క్ష‌న్ పనుల‌ను మే నెల క‌ల్లా పూర్తి చేసి, సెప్టెంబర్ 28న స‌లార్ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఈ సినిమాకి ఇదే డేట్ వినిపిస్తూ వస్తోంది. అదే డేట్ కు ప్రశాంత్ నిల్ - ప్రభాస్- హోం బలే ప్రొడక్షన్స్ కట్టుబడి ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఫస్ట్ లుక్ లు విడుదలై సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేశాయి.

కాగా ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇక ఇందులో పృథ్విరాజ్ సుకుమార‌న్ విలన్ గా కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తుండగా హీరోయిన్ శృతిహాసన్ ఓ జర్నలిస్టు పాత్రను పోషిస్తుంది. మొత్తానికి స‌లార్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు అందరిలోనూ ఈ చిత్రంపై ఆసక్తి బాగా పెరిగిపోతుంది. సలార్ మూవీ బాహుబలి, కే జి ఎఫ్ ఫ్రాంచైజీ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టిస్తుందా? లేదా అనేది వేచిచూడాలి. ఆ రేంజ్ లో ఆకట్టుకుంటే మాత్రం ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.