English | Telugu

నాలుగు జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడితో యంగ్ టైగర్!

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే తదుపరి చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఎన్టీఆర్ తో కొర‌టాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. దీనికి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ కేజిఎఫ్ ఫ్రాంచైజ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ చిత్రం చేయనున్నారు. ఆ తరువాత ఆయన ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. కొరటాల శివ సినిమాని ఈనెల 20వ తేదీన లాంచనంగా పూజతో ప్రారంభించి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఇక తమిళ దర్శకుడు వెట్రిమార‌న్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం మైత్రి మూవీ సంస్థ ఐదు కోట్ల అడ్వాన్స్ కూడా వెట్రిమార‌న్ కి ఇచ్చిందని సమాచారం.

ఇందులో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా మరో కోలీవుడ్ స్టార్ అయిన ధనుష్ కూడా న‌టిస్తున్నార‌ని సమాచారం. ఇప్పటివరకు దర్శకుడు వెట్రిమార‌న్ ఎక్కువగా ధనుష్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన ఖాతాలో ఇప్పటివరకు నాలుగు జాతీయ పురస్కారాలు ఉన్నాయి. దాంతో ఎన్టీఆర్- ధనుష్ -వెట్రిమారన్ కాంబినేషన్ పై అన్నిచోట్ల ఆసక్తి మొదలైంది. అందునా తెలుగులో నెంబర్ వన్ ప్రొడక్షన్ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని రూపొందిస్తూ ఉండడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. సాధారణంగా ఈమధ్య తెలుగు సినిమాలపై తమిళ తంబీలు మండిపడుతున్నారు. కారణం ఏమిటో తెలియదు గానీ బాలీవుడ్ ని మించి టాలీవుడ్ ఎదుగుతుందని కసితో కోపంతో వారు తెలుగు చిత్రాలపై ట్రోలింగ్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని వాదన ఉంది. వారు కోలీవుడ్ కంటే ఇత‌ర భాష‌ల వారు కాస్త ముంద‌డుగు వేస్తే స‌హించ‌లేరు.

కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ వెట్రి మారన్ సినిమాపై తమిళ ప్రేక్షకులు పాజిటివ్‌గాస్పందిస్తున్నారు. వెట్రిమార‌న్ తో ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి కోలీవుడ్ మీడియా కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ వెట్రిమార‌న్ కాంబినేషన్లో సినిమా అంటే అందులో ధనుష్ నటించిన ఈ చిత్రం కావ‌డంతో ఈ మూవీ తెలుగు తమిళంలో భారీ అంచనాలను పెంచే అవకాశం ఉం. అందునా ఇది పాన్ ఇండియా మూవీ కావడం ఎన్టీఆర్ తో పాటు ధనుష్ కి కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి ఈ చిత్రం ఇదే కాంబోలో రూపొందితే మాత్రం అంచనాలు తారాస్థాయిలో ఉంటాయని కచ్చితంగా చెప్పవచ్చు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.