English | Telugu

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో.. మ‌రీ ఇంత త‌క్కువా!

'వ‌కీల్ సాబ్', 'భీమ్లా నాయ‌క్' వంటి వ‌రుస విజ‌యాల త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా 'బ్రో'. ఇందులో 'సుప్రీమ్' హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా.. ప‌వ‌న్ స్పెష‌ల్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేయ‌నున్నారు. 'వినోదయ సిత‌మ్' అనే త‌మిళ చిత్రం ఆధారంగా 'బ్రో' రూపొందింది. మాతృక‌ని డైరెక్ట్ చేసిన స‌ముద్రఖ‌ని.. ఈ రీమేక్ ని కొన్ని మార్పు చేర్పుల‌తో తెర‌కెక్కించారు. ఈ నెల 28న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జ‌నం ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమా ర‌న్ టైమ్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. కేవ‌లం 130 నిమిషాలు (2 గంట‌ల 10 నిమిషాలు) నిడివితో ఈ సినిమా సాగుతుందట‌. అంతేకాదు.. చిత్రం ప్రారంభ‌మైన 20 నిమిషాల త‌రువాతే ప‌వ‌న్ పాత్ర ఎంట్రీ ఇస్తుంద‌ట‌. ఏదేమైనా.. ఇటీవ‌ల కాలంలో ప‌వ‌న్ సినిమాల్లో ఇదే త‌క్కువ డ్యూరేష‌న్ ఉన్న ఫిల్మ్ అని చెప్పాలి. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

త‌మ‌న్ సంగీతమందించిన‌ 'బ్రో'లో కేతికా శ‌ర్మ‌, ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ నాయిక‌లుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నుండ‌గా.. ఊర్వ‌శి రౌటేలా ప్ర‌త్యేక గీతంలో క‌నువిందు చేయ‌నుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.