English | Telugu

పాయల్ మంగళవారం బిజినెస్ మామూలుగా లేదుగా!

'ఆర్ఎక్స్ 100'తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మహా సముద్రం' మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక 'ఆర్ఎక్స్ 100'తోనే హీరోయిన్ గా పరిచయమైన పాయల్‌ రాజ్‌పుత్‌ ఆ సినిమాలో తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేసింది. అయితే ఆ తర్వాత ఆమెకు కూడా సరైన విజయాల్లేవు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి 'మంగళవారం' అనే సినిమాలో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.

ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ 'మంగళవారం'. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గ్రామంలో మంగళవారం నాడు జరిగే హత్యల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఇంటెన్స్ గా సాగింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. అసలే హారర్ థ్రిల్లర్ జానర్, దానికితోడు ఇందులో పాయల్‌ ది బోల్డ్ రోల్ కావడంతో.. యూత్ ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ గా 'మంగళవారం' రూ.15 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఫిమేల్ సెంట్రిక్ చిన్న సినిమాలకు ఈ స్థాయి బిజినెస్ జరగడం నిజంగా గొప్ప విషయమే. 'ఆర్ఎక్స్ 100' కాంబో, దానికి తోడు ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ స్థాయి బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే(ఆంధ్ర, సీడెడ్ కలిపి) రూ.7.20 కోట్ల బిజినెస్ చేసిందట. ఇప్పుడు ఆ బయ్యర్లు రిటైల్ గా ఒక్క ఆంధ్రనే రూ.6 కోట్లకు అమ్మాలని చూస్తున్నారట.

నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మంగళవారం చిత్రం విడుదల కానుంది. విడుదలకు ముందుకు బిజినెస్ పరంగా ఈ స్థాయి సంచలనాలు సృష్టిస్తున్న మంగళవారం.. విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.