English | Telugu

‘అహం బ్రహ్మస్మి’ అటకెక్కలేదట.. అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

మంచు మనోజ్‌ సినిమా కెరీర్‌ ముగిసినట్టేనా అనే సందేహం అందరిలోనూ ఉంది. ఎందుకంటే 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత మరో సినిమా రిలీజ్‌ అయ్యింది. ఆ సినిమా తర్వాత రెండు సినిమాల్లో గెస్ట్‌ క్యారెక్టర్లు చేశాడంతే. మళ్లీ కొన్నాళ్ళకు ‘అహం బ్రహ్మస్మి’ అంటూ ఓ కొత్త తరహా కథతో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్‌ చేశాడు. దానికి సంబంధించిన పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకి శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకుడు. పోస్టర్‌ చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది. తప్పకుండా మనోజ్‌కు మంచి హిట్‌ సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు.

అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్‌ ఈ సినిమాపై దృష్టి పెట్టలేదని అర్థమవుతోంది. మొదటి భార్య ప్రణతిరెడ్డితో విడాకులు, ఈ సంవత్సరం భూమా మౌనికతో రెండో పెళ్ళి వంటి కారణాలతో సినిమా వాయిదా పడిరది. అతని పెళ్లి జరిగి ఆరు నెలలు దాటిపోతున్నా ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఇక సినిమాని పక్కన పెట్టినట్టేనని అందరూ భావించారు. అయితే అనుకోకుండా ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ ‘అహం బ్రహ్మస్మి’కి సంబంధించిన అప్‌డేట్‌ త్వరలోనే ఉంటుందని ప్రకటించాడు. మనోజ్‌ వ్యక్తిగత కారణాల వల్లే సినిమాను పక్కన పెట్టామని, అది మా ఇద్దరి అంగీకారంతోనే జరిగిందని చెప్పాడు. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేసుకుంటానని మనోజ్‌తో చెప్పడం, అతను కూడా ఓకే చెప్పడంతో ‘ఆదికేశవ’ సినిమా స్టార్ట్‌ చేశాడు. అయితే ‘అహం బ్రహ్మస్మి’ సినిమా ఆగిపోలేదని, తప్పకుండా ఉంటుందని శ్రీకాంత్‌ స్పష్టం చేశాడు.

వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఆదికేశవ’ చిత్రం నవంబర్‌ 10న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సినిమాలోని ‘లీలమ్మో..’ అనే పాటను విడుదల చేశారు. ఈ ఫంక్షన్‌లో మాట్లాడుతూ శ్రీకాంత్‌ ‘అహం బ్రహ్మస్మి’ చిత్రం గురించిన అప్‌డేట్‌ ఇచ్చాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.