English | Telugu

చంద్రముఖి మీ ఇంటికొచ్చింది..బి కేర్ ఫుల్  

కొన్ని కొన్ని సినిమాలు వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రేక్షకుల మనసులో మాత్రం ఆ సినిమా యొక్క ఛాయ నిలిచిపోతుంది. అలా ప్రేక్షకులు మనసులో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమా చంద్రముఖి. ఆ సినిమాకి సీక్వెల్ గా అదే పేరుతో వచ్చిన సినిమా చంద్రముఖి 2 .ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించిన వార్త సినీ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపింది.

బాలీవుడ్ అగ్రకథానాయిక కంగనా రనౌత్ ,రాఘవ లారెన్స్ లు నటించిన చంద్రముఖి 2 సినిమా గత నెల సెప్టెంబర్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. చంద్రముఖి మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన పి.వాసునే పార్ట్ 2 కి కూడా దర్శకత్వం వహించాడు. ఇప్పుడు చంద్రముఖి సరికొత్త రూపంతో ప్రేక్షులందర్నీ పలకరిస్తుంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా చంద్రముఖి 2 ఈ రోజు అందరి ఇళ్లల్లోకి వచ్చేస్తుంది.
మొదటి పార్ట్ లో వేటరాజుని అంతం చేసిన చంద్రముఖి తిరిగి అదే ఇంట్లో ఆత్మ గా ఉంటుంది. ఒక గుడిలో పూజ చేయించుకోవడానికి చంద్రముఖి ఉన్న ఇంట్లోకి ఒక ఫ్యామిలి దిగుతుంది. ఆ ఫ్యామిలీ లోని ఒక అమ్మాయికి చంద్రముఖి ఆవహిస్తుంది. వాళ్ళు చెయ్యాలనుకున్న పూజ జరగకుండా ఆ అమ్మాయి లో ప్రవేశించిన చంద్రముఖి ప్రయత్నాలు చేస్తుంది. చంద్రముఖి ఎందుకు పూజ జరగకుండా అడ్డుకుంటుంది? అలాగే అసలు వేట రాజు గతం ఏంటి? చంద్రముఖి గతం ఏంటి? వేట రాజు కి చంద్రముఖి కి మధ్య గతంలో ఏం జరిగింది అనే కథ మొత్తాన్ని చంద్రముఖి 2 లో చూపించడం జరిగింది. సీనియర్ హీరోయిన్ రాధిక, లక్షిమీనన్ ,వడివేలు , శత్రు తదితరులు నటించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.