English | Telugu

ఎంతగానో చింతిస్తున్నాను.. పవన్ కళ్యాణ్ అధికార లేఖ విడుదల 


-పవన్ అధికార లేఖ విడుదల
-లేఖ లో ఏముంది
-చిరంజీవితో ఇప్పటికి గుర్తుండిపోతుంది


భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న లెజండ్రీ ప్రొడ్యూసర్లలో 'ఎ.వి.ఎం(AVM)సంస్థ అధినేత 'శరవణన్‌'(Saravanan)కూడా ఒకరు. హీరోతో పాటు 24 క్రాఫ్ట్స్ మొత్తం ఎ.వి.ఎం. సంస్థలో సినిమా చెయ్యాలంటే పెట్టి పుట్టాలనే సామెత కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. 84 సంవత్సరాల వయసు గల శరవణన్‌ గారు వృద్దాప్య సమస్యలు తలెత్తడంతో ఈ రోజు చనిపోవడం జరిగింది. దీంతో భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆ లెజండ్రీ శిఖరానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారు.

ఈ కోవలోనే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం హోదాలో ఒక అధికార లేఖ విడుదల చేసారు. సదరు లేఖలో 'శరవణన్ గారు చనిపోయారనే విషయం తెలిసి ఎంతో చింతించాను. ఎ.వి.ఎం సంస్థ సుదీర్ఘ ప్రస్థానం కలిగిన సంస్థగా ఎదగడానికి శరవణన్ గారు ఎంతో కృషి చేశారు. విభిన్న కథాంశాలు ఎంచుకొని కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు నిర్మించే సంస్థగా పేరు సంపాదించింది. చిరంజీవి గారితో నిర్మించిన పున్నమి నాగు తరాల అంతరం లేకుండా నేటికీ ఎంతో మందిని అలరిస్తుంది. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు,లీడర్, మెరుపు కలలు, శివాజీ చిత్రాలు ప్రేక్షకులని మెప్పించాయి. ఆయన ఆత్మకి శాంతి చేకూరడంతో పాటు ఆయన కుటుంబసభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని సదరు లేఖలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు.

also read:రాజ్ విషయంలో సమంత కీలక నిర్ణయం

తమిళ,తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఎ.వి.ఎం నుంచి సుమారు 300 సినిమాల వరకు సిల్వర్ స్క్రీన్ పై మెరిసాయి. దాదాపుగా అందరి అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన ఎ.వి.ఎం 1947 లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. చివరగా సదరు సంస్థ నుంచి వచ్చిన మూవీ 'ఈదువుమ్ కాదందు పోగుమ్. 2014 లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజవ్వగా సినీ అభిమానుల మన్ననలు అందుకుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.