English | Telugu

శివ‌రాజ్‌కుమార్‌ని జ‌స్ట్ ట‌చ్ చేసిన శింబు

శివ‌రాజ్‌కుమార్, శ్రీ ముర‌ళి, శాన్వి శ్రీవాస్త‌వ‌, మ‌ధు గురుస్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన క‌న్న‌డ సినిమా మ‌ఫ్టి. న‌ర్త‌న్ ఈ సినిమాకు డైర‌క్ష‌న్ చేశారు. కంప్లీట్ గా యాక్ష‌న్ ఓరియంటెడ్ మాస్ సినిమా ఇది. ఈ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కింది శింబు న‌టించిన పత్తుత‌ల‌. త‌మిళంలో ప‌త్తుత‌ల సినిమాను తెర‌కెక్కిస్తున్నారు కృష్ణ‌. శింబు, గౌత‌మ్ కార్తిక్ కీ రోల్స్ చేశారు. ప్రియా భవానీ శంక‌ర్ నాయిక‌గా న‌టించారు. మార్చి 30న విడుద‌ల కానుంది ప‌త్తు త‌ల‌. ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. చూసిన వారంద‌రూ న‌ర్త‌న్ సినిమా మ‌ఫ్టీలాగా ఉంద‌ని అన్నారు. దాని గురించి ద‌ర్శ‌కుడు కృష్ణ మాట్లాడుతూ ``ఈ సినిమాను దాదాపు రెండేళ్ల‌కు పైగా తెర‌కెక్కించాం.

ఇన్నాళ్లుగా ఈ సినిమా మీద క్రేజ్ పెంచుకుంటూ వ‌చ్చిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అయ్యే తీరుతుంది. కాక‌పోతే అది ఎంత పెద్ద హిట్ అనే కంపేరిజ‌న్స్ వ‌స్తాయేమోన‌ని ఆలోచిస్తున్నాం`` అని అన్నారు. ఈ సినిమా మ‌ఫ్టీకి రీమేక్‌గా చేశారా? అని ప్ర‌శ్నించగా ``ఇది రీమేక్ కాదు. 90 శాతం కొత్త క‌థ ఉంటుంది. మేం చాలా స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేశాం. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సార్ అత్య‌ద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. మేం ఎన్ని ట్యూన్లు అడిగినా రెహ‌మాన్ సార్ నో అని చెప్ప‌కుండా ఇచ్చారు. ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఆద‌రించిన తీరుకు ఫిదా అయిపోయాం. మార్చి 18న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఎ.ఆర్‌.రెహ‌మాన్ మా సినిమాలోని పాట‌ల‌తో లైవ్ కాన్స‌ర్ట్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా అంటేనే నా దృష్టిలో డైలాగులే కీల‌కం. అద్భుతంగా కుదిరాయి. శివ‌రాజ్‌కుమార్ క‌థ‌ను జ‌స్ట్ ట‌చ్ చేశాం. ఆ సినిమా చూసిన వారికి కూడా మా సినిమా కొత్త‌గా అనిపిస్తుంది. అంత బాగా శింబుకి టైల‌ర్ మేడ్ కేర‌క్ట‌ర్‌లాగా తీర్చిదిద్దాం`` అని అన్నారు. ప‌త్తు త‌ల టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. రీసెంట్ టైమ్స్ లో స‌క్సెస్ మీదున్న శింబు, ఈ సినిమా ఆ స‌క్సెస్‌ని కంటిన్యూ చేస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.