English | Telugu

పేరుకి పాన్ ఇండియా మూవీ.. పార్ట్-2 కి బజ్ ఏది?

పాన్ ఇండియా సినిమాకి, అందునా పార్ట్-2 కి ఉండే క్రేజే వేరు. 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' సినిమాల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూశారో తెలిసిందే. అందుకే ఆ సినిమాలు మొదటి భాగాలను మించి ఎన్నో రెట్ల విజయాన్ని సాధించాయి. అయితే కోలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'పొన్నియన్ సెల్వన్-2' విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం అదే పేరుతో 'పొన్నియన్ సెల్వన్' అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీనిని తమిళ బాహుబలిగా అక్కడి సినీ ప్రముఖులు, సినీ అభిమానులు భావించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్ వంటి స్టార్స్ నటించిన ఈ చిత్ర మొదటి భాగం గతేడాది విడుదలై దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో అక్కడ సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఇతర భాషల ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం మెప్పించలేకపోయింది. పాత్రలు పేర్లు గుర్తుపెట్టుకోవడం, వారి మధ్య బంధాన్ని అర్థం చేసుకోవడం.. ప్రేక్షకులకు పెద్ద టాస్క్ లా అనిపించింది. ఆ సినిమాలో నటించిన కార్తీనే మొదట్లో ఆ పాత్రల విషయంలో గందరగోళానికి గురయ్యాడంటే.. ఇక 'పొన్నియన్ సెల్వన్' నవలపై ఏమాత్రం అవగాహన లేని ఇతర భాషల ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు నెమ్మదిగా సాగే కథనం కూడా ఇతర భాషల ప్రేక్షకులను మెప్పించలేకపోవడానికి ఒక కారణం. అందుకేనేమో 'పొన్నియన్ సెల్వన్-2'పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదు.

మామూలుగా ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి రెండో భాగం వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంది. మొదటి భాగాన్ని మించేలా ఓపెనింగ్స్ వస్తాయి. కానీ 'పొన్నియన్ సెల్వన్-2' విషయంలో మాత్రం అలా జరగడం లేదు. మొదటి భాగం స్థాయిలో కూడా రెండో భాగానికి అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఈ ఏప్రిల్ 28 నే ఈ సినిమా విడుదల కానుంది. ఇంకా విడుదలకు ఐదు రోజులు కూడా లేదు. అయినా సినిమాపై బజ్ క్రియేట్ కాలేదు. ఈ సినిమా విడుదలవుతుందని తమిళ్ తప్ప ఇతర భాషల్లో సాధారణ ప్రేక్షకులకు అవగాహన కూడా లేదు. మిగతా పాన్ ఇండియా సినిమాల్లాగా మొదటి భాగం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్లను రాబట్టడం సంగతి అటుంచితే.. కనీసం మొదటి భాగానికి వచ్చినన్ని వసూళ్లయినా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.