English | Telugu

సారథీలో నాగ్ డమరుకం షూటింగ్

సారథీలో నాగ్ "డమరుకం" షూటింగ్ జరుగుతుంది. వివరాల్లోకి వెళితే ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై, యువసామ్రాట్, అక్కినేని నాగార్జున హీరోగా, అనుష్క హీరోయిన్ గా, "అదిరిందయ్యా చంద్రం" ఫేం శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో,డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్నభారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ చిత్రం "డమరుకం". నాగ్ "డమరుకం" చిత్రం కోసంక భారీ సెట్ ను నిర్మించారు.ఆ సెట్ లో నాగార్జున "డమరుకం" చిత్రం షుటింగ్ జరుగుతుంది. ఈ నాగ్ "డమరుకం" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు ఈ నాగ్ "డమరుకం" సినిమాకి కెమెరామేన్ గా వ్యవహరిస్తున్నారు. నాగ్ "డమరుకం" చిత్రంలో హీరో సామాన్య ఆటో డ్రైవర్ గా నటిస్తూండగా, పరమేశ్వరుడిగా విలక్షణ బహు భాషా నటుడు ప్రకాష్ రాజ్, అద్భుతశక్తులున్న అమ్మాయిగా అనుష్క, అభిమన్యు సింగ్ ఒక ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ నాగ్ "డమరుకం" చిత్రాన్ని యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించటం విశేషం. ఇది హీరో అక్కినేని నాగార్జున సినీ కేరీర్ లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా చెప్పవచ్చు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.