English | Telugu

కలెక్షన్ కింగ్ మళ్ళీ వాడుకున్నాడట...!

ప్రముఖ నటుడు మోహన్ బాబు,హాస్యనటుడు బ్రహ్మానందంలపై రాష్ట్ర హైకోర్టులో బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కేసు వేసిన సంగతి అందరికి తెలిసిందే. పద్మశ్రీ అవార్డును సినిమాలకు వాడుకుంటున్నారని ఇంద్రసేనారెడ్డి కేసు వేసారు. దీన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ మంగళవారం విచారణకు స్వీకరించింది. అయితే తాజాగా పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో కూడా మోహన్ బాబు తన పేరుకు ముందు పద్మశ్రీని వాడుకున్నట్టు వాదిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన కోర్టుకు సమర్పించినట్టు తెలిసింది. మరి ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .