English | Telugu

టాలీవుడ్ లో విషాదం.. 'మిథునం' నిర్మాత కన్నుమూత!

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 'మిథునం' వంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మొయిద ఆనందరావు(57) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు.

విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు సాహిత్య, పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణాన్ని రక్షించాలని కోరుతూ ఆయన అనేక పద్యాలు కూడా రాశారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత వ్యాపారస్తుడిగా ఎదిగారు. సంఘ సేవకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. తన అభిరుచికి తగ్గట్లు 2012 లో 'మన అమ్మానాన్నల ప్రేమకథ' అంటూ 'మిథునం' అనే గొప్ప చిత్రాన్ని నిర్మించారు. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలను కూడా ఈ చిత్రం అందుకుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.