Read more!

English | Telugu

టాలీవుడ్ లో విషాదం.. 'మిథునం' నిర్మాత కన్నుమూత!

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 'మిథునం' వంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మొయిద ఆనందరావు(57) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు.

విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు సాహిత్య, పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణాన్ని రక్షించాలని కోరుతూ ఆయన అనేక పద్యాలు కూడా రాశారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత వ్యాపారస్తుడిగా ఎదిగారు. సంఘ సేవకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. తన అభిరుచికి తగ్గట్లు 2012 లో 'మన అమ్మానాన్నల ప్రేమకథ' అంటూ 'మిథునం' అనే గొప్ప చిత్రాన్ని నిర్మించారు. బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలను కూడా ఈ చిత్రం అందుకుంది.