English | Telugu

ఈ వారం కూడా 'బలగం' సినిమాదే హవా!

బాక్సాఫీస్ దగ్గర ఒక్కోసారి చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బలగం' సినిమా ఆ కోవలోకే వస్తుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 3న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. రూ.1.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రెండు వారాలు తిరక్కుండానే రూ.6.5 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. ఇప్పటికీ విశేష ఆదరణ పొందుతోన్న బలగం.. ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర హవా చూపించేలా ఉంది.

ఈ శుక్రవారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' కాగా, రెండోది కన్నడలో రూపొందిన పాన్ ఇండియా ఫిల్మ్ 'కబ్జా'. అయితే ఈ రెండు సినిమాలకు ఎందుకనో రావాల్సినంత బజ్ రాలేదు. ముఖ్యంగా 'ఊహలు గుసగుసలాడే' వంటి సూపర్ హిట్ అందించిన నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండాలి. క్లాస్ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించాలి. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు. మౌత్ టాక్ మీదే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇక కబ్జా సినిమానైతే తెలుగులో పట్టించుకునే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బలగం చిత్రం తొమ్మిదో రోజైన గత శనివారం నాడు రూ.1.77 కోట్ల గ్రాస్, పదో రోజైన ఆదివారం రూ.2.36 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. వీక్ డేస్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. సోమవారం 67 లక్షలు, మంగళవారం 88 లక్షలు, బుధవారం 91 లక్షల గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా నైజాంలో బలగం చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'కి పాజిటివ్ టాక్ రావడమో లేదా వచ్చే వారం కొత్త చిత్రాల తాకిడి వరకు బలగం జోరు కొనసాగే అవకాశముంది. ముఖ్యంగా నైజాంలో హవా చూపిస్తుంది అనడంలో సందేహం లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.