English | Telugu

శెట్టి అండ్ శెట్టి గట్టిగానే కొట్టేశారు.. 4 రోజుల్లో రాబట్టిన వసూళ్ళు ఇవే!

బోల్డ్ పాయింట్ ని ఎలాంటి అసభ్యత లేకుండా తెరకెక్కించి.. విజయం అందుకోవడం అంత సులభతరం కాదు. అందునా.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ ముందు. అయితే, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. 'జవాన్' తుఫాన్ ముంగిట కూడా తొలి వారాంతంలో మంచి వసూళ్ళు రాబట్టిట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి, యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి టైటిల్ రోల్స్ లో నటించిన ఈ క్లాస్ మూవీ.. గురు, శుక్రవారాల్లో మంచి వసూళ్ళు చూసింది. ఇక శని, ఆది వారాల్లో అయితే అంతకంటే మెరుగైన కలెక్షన్స్ రాబట్టుకోవడం విశేషం.

రూ. 13.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 3 కోట్ల షేర్, సెకండ్ డే రూ. 2.26 కోట్ల షేర్ ఆర్జించగా, మూడో రోజైన శనివారం రూ. 3.58 కోట్ల షేర్, నాలుగో రోజైన ఆదివారం రూ. 4.36 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా.. ఈ నాలుగు రోజుల్లో రూ. 13. 20 కోట్ల షేర్ చూసింది. సోమవారం వచ్చే వసూళ్ళతో బ్రేక్ ఈవెన్ పక్కా అనే చెప్పొచ్చు. మండే టెస్ట్ లో పాసైమంచి వసూళ్ళు వస్తే.. ఇవాళ్టి నుంచే ప్రాఫిట్ జోన్ లోకి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' వచ్చినట్టే. ఏదేమైనా.. శెట్టి అండ్ శెట్టి గట్టిగానే హిట్ కొట్టేశారని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.