English | Telugu

వారెవా.. నాలుగు రోజుల్లో రూ. 500 కోట్లు.. 'జవాన్' కలెక్షన్ తుఫాన్ !

ఊరికే ఎవరూ బాలీవుడ్ బాద్షాలుఅయిపోరు. బాక్సాఫీస్ లెక్కలను సరిచేస్తూ.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ.. ముందుకు సాగుతుంటేనే అలాంటి బిరుదులు వచ్చేస్తుంటాయి. ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'కింగ్ ఖాన్' షారుక్ ఖాన్ గురించే. తాజాగా ఆయన తండ్రీకొడుకులుగా సందడి చేసిన 'జవాన్' చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఎంతలా అంటే.. కేవలం నాలుగు రోజుల్లో రూ. 500 కోట్ల గ్రాస్ రాబట్టేంతలా. అంతేకాదు.. సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన 'జవాన్'.. తొలి రోజు నుంచి నాలుగో రోజు వరకు రూ. 100 కోట్ల గ్రాస్ కు ఏ మాత్రం తగ్గకుండా దూకుడు చూపిస్తూ ట్రేడ్ పండితులను విస్మయపరుస్తోంది. మండే టెస్ట్ లో కూడా పాసై.. ఇదే హవా కొనసాగితే రూ. 1000 కోట్లు రాబట్టడం 'జవాన్'కి పెద్ద టాస్కేమి కాదు.

కాగా, 'జవాన్'లో షారుక్ ఖాన్ సరసన నయనతార, దీపికా పదుకొణె (స్పెషల్ రోల్) నటించగా.. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. సంజయ్ దత్ అతిథి పాత్రలో దర్శనమిచ్చిన ఈ సినిమాకి కోలీవుడ్ కెప్టెన్ అట్లీ దర్శకత్వం వహించాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.