English | Telugu

పాన్ ఇండియా పై దృష్టి సారించిన మెగా ప్రిన్స్!

మెగా ప్రిన్స్ గా ప్రేక్షకులందరికీ వరుణ్ తేజ్ సుపరిచితులు, నాగబాబు తనయుడు అయినా వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అభిమానులు ఆయ‌న‌ను మెగాప్రిన్స్ అనే బిరుదుతో పిలుస్తూ ఉంటారు. మంచి ఒడ్డు పొడుగు ఉండే ఈయ‌న ప్ర‌స్తుతం మెగా కాంపౌండ్ హీరోలంద‌రిలోకి ఆజానుబాహుడ‌ని చెప్పాలి. ఈయనకున్న ఎత్తు పొడవుకి డాన్సులు సరిగా అచ్చి రావడం లేదు. దాంతో మిగిలిన మెగా కాంపౌండ్ హీరోల కంటే ఈయ‌న డ్యాన్స్ లో వెనుక‌బ‌డి ఉన్నారు. ఎందుకంటే టాలీవుడ్ లో మెగాకాంపౌండ్ హీరోలంటే అంద‌రికీ డ్యాన్సింగ్ స్కిల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. మెగాభిమానులు కూడా వారి నుంచి అవే ఆశిస్తారు. కానీ మొద‌టి నుంచి వ‌రుణ్‌తేజ్ డ్యాన్స్ ల విష‌యంలో వీకే. అదే సంద‌ర్బంలో ఆయ‌న మిగిలిన మెగాహీరోల కంటే డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే డాన్స్ వంటి వాటిని పక్కనపెట్టి తన యాక్టింగ్ స్కిల్స్ పై దృష్టి పెట్టబోతున్నారు.

ఆయనకు ఇటీవల విడుదలైన గని చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ తో గాండీవ దారి అర్జున చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. ఇందులో మొదటిసారిగా వరుణ్ తేజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఆ సర్కిల్లోకి వరుణ్ తేజ్ ఎంటర్ కావాలి అనుకుంటున్నారు. అందుకే డిఫరెంట్ కాన్సెప్టులను ట్రై చేస్తున్నారు. గాండీవ దారి అర్జున చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఆయన ఏ రేంజిని హిట్లందుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయనకు గాండీవ దారి అర్జున చిత్రం విజయం అత్యంత కీలకం.

దీని తరువాత ఆయన తెలుగు హిందీ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నారు. ఆ సినిమాలో ఎయిర్ ఫైటర్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ మూవీ క‌థ‌ను దర్శకుడు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ద‌ర్శ‌కుడు ఎవ‌రు అనేది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది. దీనితో పాటు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న ఏ వైవిధ్య‌భరిత‌మైన క‌థ‌ను ఆయ‌న వ‌ద‌ల‌డం లేదు. త‌న‌దైన డిఫ‌రెంట్ చిత్రాల‌తో త‌న స‌త్తా చాటాల‌నేది ఆయ‌న ఆశ‌యంగా క‌నిపిస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.