English | Telugu

‘తగ్గేదేలే..’ అంటున్న మన్సూర్‌.. మంచి ఫోటోలు దొరకలేదా అంటూ మీడియాపై ఫైర్‌

మన్సూర్‌ అలీఖాన్‌ వివాదం రోజురోజుకీ ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. అతను త్రిష, రోజా, ఖుష్బూలపై చేసిన వ్యాఖ్యలకు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. త్రిషను సపోర్ట్‌ చేస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించారు. ఈ వీడియోను చూసిన తమిళ నడిగర్‌ సంఘం మన్సూర్‌పై నిషేధం విధించింది. దీనిపై మండిపడ్డ మన్సూర్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో తనదైన శైలిలోనే స్పందించాడు. నడిగర్‌ సంఘానికి నాలుగు గంటలు టైమిస్తున్నానని, ఈలోగా తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాడు. జరిగిన దాని గురించి వివరణ అడగకుండా, తనను సంప్రదించకుండా తనను ఎలా నిషేధిస్తారని ప్రశ్నిస్తున్నాడు.

ఎంతమంది నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా.. తను మాత్రం తగ్గేదేలే అంటున్నాడు మన్సూర్‌. క్షమాపణ కూడా చెప్పను అని ఖరాఖండీగా చెబుతున్నాడు. తాను సరదాగా అన్న మాటలను మీడియా వక్రీకరించిందని, వీడియోను ఎడిట్‌ చేసి తనను అభాసుపాలు చెయ్యాలని ప్రయత్నిస్తోందని విమర్శించాడు. సినిమాల్లో రేప్‌ చేస్తే నిజంగా చేసినట్టు అవుతుందా.. అలాగే సినిమాల్లో హత్య చేసినట్టుగా చూపిస్తే అది నిజంగా చేసినట్టా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. తాను తప్పు చేస్తే క్షమాపణ అడిగేందుకు సిద్ధమేనని, అయితే తానేమీ తప్పు చేయలేదని అంటున్నాడు. నడిగర్‌ సంఘం మాత్రం మన్సూర్‌ క్షమాపణ చెప్పి తీరాలని, లేకపోతే నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఎంతో సీరియస్‌గా జరుగుతున్న ప్రెస్‌మీట్‌లో మరో అంశాన్ని లేవనెత్తాడు మన్సూర్‌. తను అన్న మాటల గురించి అన్ని మీడియా సంస్థలు రాశాయని, అయితే అందులో వాడిన ఫోటోలు అంత క్వాలిటీగా లేవని, అంతకంటే మంచి ఫోటోలు మీకు దొరకలేదా అంటూ మీడియాను ఒకింత సీరియస్‌గానే అడిగాడు మన్సూర్‌. ఈ ప్రశ్నతో అక్కడి మీడియా ప్రతినిధులు షాక్‌ అయ్యారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.