English | Telugu

అల్లుడితో ఆడిపాడిన లేడీతో ర‌జ‌నీ జోడీ!

త‌న మాజీ అల్లుడు ధ‌నుష్‌తో ఆడిపాడిన లేడీతో ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లోనే జోడీ క‌ట్ట‌బోతున్నారు. త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో న‌టించ‌డానికి మ‌లయాళ న‌టి మంజు వారియ‌ర్ ఆల్రెడీ ఓకే చెప్పేశారు. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా కోసం ఈ కాంబినేష‌న్ కుదిరింది. త‌లైవ‌ర్ 170 అని టెంటేటివ్‌గా పిలుస్తున్నారు. ఈ సినిమాలోనే అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఫాహ‌ద్ ఫాజిల్ కీ రోల్స్ చేస్తున్నారు. త‌మిళంలో ఈ మ‌ధ్య వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు మంజు వారియ‌ర్‌. అజిత్ కుమార్‌తో తునివు చేశారు. ధ‌నుష్ తో అసుర‌న్ చేశారు. త్వ‌ర‌లోనే ఆర్య‌, గౌత‌మ్ కార్తిక్ కాంబినేష‌న్‌లో సినిమా మొద‌లుపెట్ట‌నున్నారు. ఈ సినిమాకు మిస్ట‌ర్ ఎక్స్ అనే పేరు ఖ‌రారైంది. మ‌ను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. మంజు వారియ‌ర్ త‌న ఫేవ‌రేట్ ఆర్టిస్ట్ విజ‌య్ సేతుప‌తితో విడుద‌లై 2లో న‌టిస్తున్న‌ట్టు టాక్‌. సూరి, విజ‌య్ సేతుప‌తి న‌టించిన విడుద‌లై సినిమా ఫ‌స్ట్ పార్ట్ చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా సీక్వెల్‌లోనే విజ‌య్ సేతుప‌తికి భార్య‌గా క‌నిపించ‌నున్నారు మంజు వారియ‌ర్. ర‌జ‌నీకాంత తో ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం థ్రిల్లింగ్‌గా ఉంద‌ని చెప్పార‌ట మంజువారియ‌ర్‌.

జై భీమ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టి.జె.జ్ఞానవేల్ త‌లైవ‌ర్ 170 సినిమాలో మంజు వారియ‌ర్‌కి కూడా చాలా మంచి రోల్ రాశార‌ట‌. విన‌గానే ఓకే చెప్పారట మంజు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సెప్టెంబ‌ర్ మూడో వారం నుంచి షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని టాక్‌. అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తారు. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ పేరు వేట్ట‌య‌న్ అని ప్ర‌చార‌మ‌వుతోంది. నెగ‌టివ్ షేడ్స్ ఉంటాయ‌ని కూడా అంటున్నారు. ర‌జ‌నీకాంత్‌ని ఢీకొట్టే వ్య‌క్తిగా ఫాహ‌ద్‌, ర‌జనీకి ఫ్రెండ్‌గా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తార‌ట‌. మామ‌న్న‌న్‌లో న‌టించిన రత్న‌వేలు కేర‌క్ట‌ర్ ఫాహ‌ద్‌కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.