English | Telugu

పాదాభివందనంతో గురుభక్తిని చాటుకున్న దేవి

డైరెక్టర్‌కి, మ్యూజిక్‌ డైరెక్టర్‌కి మధ్య మంచి అండర్‌స్టాండిరగ్‌ ఉంటే మ్యూజికల్‌ హిట్స్‌ వస్తాయని సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌ ప్రూవ్‌ చేశారు. తన మొదటి సినిమా ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు దేవిశ్రీప్రసాద్‌ తప్ప మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వలేదు సుకుమార్‌. అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వీరిద్దరూ చేసిన ‘ఆర్య’, ‘ఆర్య2’, ‘పుష్ప’ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించారు. అలాంటి మంచి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాకి మ్యూజిక్‌ పరంగా నేషనల్‌ అవార్డు వస్తే.. ఆ ఆనందం మామూలుగా ఉండదు. ‘పుష్ప’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడుగా నేషనల్‌ అవార్డు గెలుచుకున్న దేవిశ్రీప్రసాద్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సంతోషకరమైన విషయాన్ని అందరితోనూ పంచుకుంటున్నాడు దేవి. తనకు అవార్డు వచ్చిన విషయాన్ని మొదటి తన తల్లికి చెప్పిన దేవి తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత తన సంగీత గురువైన మాండలిన్‌ శ్రీనివాస్‌ అన్నయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో తన ఆనందాన్ని పంచుకున్నాడు.
ఇక తను దైవ సమానుడుగా భావించే ఇళయరాజాను కలిసేందుకు ఈరోజు చెన్నై వెళ్ళాడు దేవి. ఇళయరాజాకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు అవార్డు వచ్చిన విషయాన్ని చెప్పాడు. దేవిశ్రీప్రసాద్‌తో ఎంతో ప్రేమగా మాట్లాడి అభినందించారు ఇళయరాజా. కొంత సేపు ఆయనతో గడిపిన దేవి ఆ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నేషనల్‌ అవార్డు ప్రకటించిన తర్వాత నా దేవుడు ఇళయరాజాను కలుసుకున్నాను. ఆయన ఇచ్చిన స్ఫూర్తే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నేషనల్‌ అవార్డు వరకు నడిపించింది’ అంటూ ఇళయరాజాను కలిసిన ఆనందాన్ని పంచుకున్నారు నేషనల్‌ అవార్డు విన్నర్‌ దేవిశ్రీప్రసాద్‌.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.