English | Telugu

మనం అందరి సినిమా

మూడు తరాల మనం చిత్రం గత కొన్ని నెలలుగా అక్కినేని అభిమానులను, సినీ అభిమానులను ఎంతగానో ఊరించిన మనం చిత్రం విడుదలపై పాజిటివ్ టాక్ కొనసాగుతోంది. చిత్రకథ చాలా చాలా ట్విస్ట్‌లున్నప్పటికీ చిత్రం అంతా అలా హాయిగా సాగిపోతుంది. సినిమాలో ఏఎన్‌ఆర్ తక్కువ సేపు కనిపించినా ఆయన సినిమా అంతా మన వెన్నంటే ఉన్నారనే ఫీల్ వుంటుంది. చిత్రంలో అక్కినేని కుటుంబంతో పాటు నటించిన వారంతా తమ తమ పాత్రలలో ఇమిడి పోయారని అనిపిస్తుంది. అయినా అందరికంటే ఎక్కువగా నాగార్జున మెప్పిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. పోటాపోటీగా ఏ పాత్రలు అనిపించకుండానే ఏ పాత్రకు ఆ పాత్ర మనని కట్టిపడేస్తాయి.ఇక హీరోయిన్లు శ్రేయా, సమంతలలో, సమంత చురుకుదనం, చిలిపిదనం ముచ్చటగా అనిపిస్తుంది.
చిత్రకథ కొంత కాంప్లెక్స్‌గా ఉన్నప్పటికీ, దానిని సింపుల్‌గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఎందుకంటే సినిమా కథ అంతా హాయిగా సాగిపోతుంది కాబట్టి.ఇక ఏఎన్‌ఆర్ నటించిన ఈ చిత్రంలో ఆయన ఇద్దరు మనుమలు నటించారు. నాగచైతన్యతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరుస్తాడు. ఉన్న కాసేపే అఖిల్ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అనే ఇంప్రెషన్ ఇచ్చాడు.
సినిమాలో ప్రతి ఫ్రేముని ఎంతో అందంగా చూపించటంలో పి.ఎస్. వినోద్ ప్రతిభ కనిపిస్తుంది. ఆయన సినిమాటాగ్రఫి ఆడియెన్స్‌ని సీటు నుంచి కదలకుండా చేస్తుందని చెప్పవచ్చు. అనూప్ రూబెన్స్ సంగీతం, విక్రమ్ కుమార్ డైరెక్షన్ మనందరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా విక్రమ్ కుమార్ కథను బ్యాలెన్స్ చేసిన తీరు సినిమాకు మరింత బ్యూటీని చేకూర్చింది. ఒక కొత్త కథను సరికొత్తగా చూపించగల దర్శక ప్రతిభకు ఈ సినిమా మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు
ప్యామిలీ చిత్రమే అయినప్పటికీ, ఏడుపులు, భారీ సన్నివేషాలు లేకుండా సింపుల్‌గా చక్కటి ఫీల్‌తో సాగిపోతుంది.ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు వచ్చిన ఈ టాక్‌తో సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.