English | Telugu

సర్జరీకి సిద్ధమవుతున్న చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రెస్ట్ మోడ్‌లోకి వెళుతున్నారు. ఆయ‌న మోకాలికి ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌నుంది. అమెరికా వెళ్లి ఆప‌రేష‌న్ చేయించుకున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి క‌దా! అనే సందేహం రాక మాన‌దు. అమెరికాలో శ‌స్త్ర చికిత్స‌ను చేయించుకోవ‌టానికి గ‌ల రిపోర్ట్స్‌ను చెక్ చేయించుకున్నార‌ట‌. అయితే ఆప‌రేష‌న్ మాత్రం అక్క‌డ చేసుకోలేదు. ఢిల్లీ లేదా బెంగుళూరులో ఆయ‌న మోకాలికి ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌నుంది. ఈ చికిత్స త‌ర్వాత మెగాస్టార్ నెల‌న్న‌ర పాటు విశ్రాంతి తీసుకోబోతున్నారు. త‌ర్వాతే త‌న కొత్త సినిమాకు సంబంధించిన వ‌ర్క్‌పై ఫోక‌స్ చేయ‌బోతున్నారు.

చిరంజీవి త‌దుప‌రి చిత్రాన్ని క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఆగ‌స్ట్ 22న చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ సినిమా స్టార్ట్ అవుతుంద‌న్నారు. కానీ.. ఇప్పుడు చిరంజీవి మోకాలి ఆపరేష‌న్ కోసం ఢిల్లీ లేదా బెంగుళూరు వెళ‌తార‌నే న్యూస్ వినిపిస్తోంది. ఎలాగూ వారం రోజులు మాత్ర‌మే ఉండ‌టంతో చిరు సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించేసి త‌ర్వాత ఆప‌రేష‌న్‌కు వెళ‌తారా? లేక బ‌ర్త్ డే ఈవెంట్స్‌ను ప‌క్క‌న పెట్టి వెళ‌తారా? అనేది చూడాలి మ‌రి. ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యాన‌ర్‌తో క‌లిసి చిరంజీవి కుమార్తె సుష్మిత నిర్మించ‌నుంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అన్నీ ప్లాన్ ప్ర‌కారం జ‌రిగితే ఈ మూవీని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. దీని త‌ర్వాత బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా ఉంటుంద‌నే న్యూస్ వినిపిస్తోంది.

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి రెండు సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు. అందులో సంక్రాంతికి వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య ఘ‌న విజ‌యం సాధించింది. అయితే రీసెంట్‌గా వ‌చ్చిన భోళా శంక‌ర్ డిజాస్ట‌ర్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ ఈ సినిమాను మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేశారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.