English | Telugu

ర‌జినీ 171... క‌మ‌ల్ కామెంట్స్‌

కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరోల్లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, యూనివ‌ర్సల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ మ‌ధ్య మంచి స్నేహం ఉంది. ఒక‌ప్పుడు సినిమాల్లో క‌లిసి న‌టించిన వీరిద్ద‌రూ త‌ర్వాత అగ్ర హీరోలుగా ఎదిగి నువ్వా నేనా? అనే రేంజ్లో పోటాపోటీగా సినిమాల‌ను రిలీజ్ చేస్తూ వ‌చ్చారు. తాజాగా క‌మ‌ల్ హాస‌న్.. సైమా అవార్డ్స్ 2023 వేడుక‌ల్లో విక్ర‌మ్ చిత్రానికిగానూ ఉత్త‌మ న‌టుడిగా అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్భంలో రజినీకాంత్‌తో ఉన్న అనుబంధంపై, లోకేష్ క‌న‌క‌రాజ్‌తో త‌లైవ‌ర్ చేయ‌బోతున్న 171వ మూవీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడ‌వి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

‘‘ఇటీవ‌ల నా స్నేహితుడు ర‌జినీకాంత్ త‌న 171వ సినిమా గురించి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఆ సినిమాను నా వీరాభిమాని లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది మీ వీరాభిమాని ర‌జినీకాంత్‌తో సినిమా చేయ‌ట‌మేంట‌ని సందేహాం వ్య‌క్తం చేశారు. అయితే ఓ స్నేహితుడిగా వారి క‌ల‌యిక‌లో సినిమా రానుండ‌టంపై ఎంతో గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. క‌మ‌ల్ 50 ఈవెంట్‌లో ర‌జినీకాంత్‌తో నా అనుబంధం గురించి మాట్లాడాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. మాలాంటి ఫ్రెండ్స్ అప్ప‌టి త‌రంలో ఎవ‌రూ లేరు. అలాగ‌ని పోటీ లేదా? అంటే ఇద్ద‌రి మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉండేది. అయితే అది ఎప్పుడూ ఆరోగ్య‌కంగా ఉండేది. అందువ‌ల్లే మేం ఈ రేంజ్‌కు చేరుకున్నాం’’ అన్నారు.

ఇదే స‌మ‌యంలో క‌మ‌ల్ హాస‌న్ త‌న 234వ సినిమా గురించి ప్ర‌స్తావించారు. నాయ‌కుడు సినిమాకు ఎలాగైతే వ‌ర్క్ చేశామో..మా కాంబోలో రాబోతున్న సినిమాకు ప‌ని చేస్తున్నాం. ఈ మూవీ సెప్టెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్‌కు జ‌త‌గా త్రిష న‌టిస్తుంది. మ‌రోవైపు క‌మ‌ల్ హాస‌న్ త‌న ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఇండియ‌న్ 2లోనూ న‌టిస్తున్నారు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.