English | Telugu

ఇండియ‌న్‌2 సెట్స్ లో కాజ‌ల్‌ 


ఇండియ‌న్‌2 సినిమా సెట్స్ లో ఉన్నారు కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ సినిమా షూటింగులో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు. వ్యానిటీ వ్యాన్‌లో ఉన్న ఫొటో షేర్ చేసుకున్నారు. త‌న లుక్‌ని జ‌నాలు గుర్తుప‌ట్ట‌కుండా ఫొటోతో హైడ్ చేసుకున్నారు. ఇండియ‌న్ 2 క‌మింగ్ సూన్ అంటూ విష‌యాన్ని పంచుకున్నారు కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఆమె ఈ పోస్టు పెట్టీపెట్ట‌గానే వెల్క‌మ్ బ్యాక్ అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇండియ‌న్‌2 షూటింగ్ ఇప్పుడు చెన్నైలో జ‌రుగుతోంది. నెల రోజుల పాటు అక్క‌డే షూటింగ్ ఉంటుంది. దీంతో మేజ‌ర్ పోర్ష‌న్ పూర్త‌వుతుంది. తిరుప‌తిలో తెర‌కెక్కించే ఆఖ‌రి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్త‌వుతుంది. ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ``ఇండియ‌న్‌2 చాలా స్పెష‌ల్‌. మ‌ళ్లీ నేను నా పుట్టింటికి వ‌చ్చిన ఫీలింగ్ క‌లుగుతోంది. సినిమా ఇండ‌స్ట్రీని నేను పుట్టిల్లుగానే భావిస్తాను. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విష‌యాల‌ను ఇక్క‌డే నేర్చుకున్నాను. ఎన్నో విష‌యాల‌ను ఆ త‌ర్వాత నేను హాబీలుగా మార్చుకున్నాను. నిత్యం న‌న్ను నేను అప్‌డేట్ చేసుకుంటూనే ఉన్నాను. కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాను. ఇలాంటి ఇండ‌స్ట్రీలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు వ‌స్తున్న అవ‌కాశాల‌కు చాలా ధ‌న్య‌వాదాలు. ఇక‌పై కొత్త కాజ‌ల్‌ని చూస్తారు `` అని రాసుకొచ్చారు.

ఇండియ‌న్‌2 సినిమాలో కాజ‌ల్‌తో పాటు ర‌కుల్ కూడా న‌టిస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ ఈ సినిమాలో దుమ్మురేప‌డానికి రెడీ అవుతున్నార‌న్న‌ది ఇన్‌సైడ్ టాక్. ఆల్రెడీ విక్ర‌మ్‌తో స‌క్సెస్ ఎంజాయ్ చేస్తున్న క‌మ‌ల్‌హాస‌న్ ఆ జోష్‌తోనే ఈమూవీ చేస్తున్నార‌ట‌. బాబీ సింహా, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, సిద్ధార్థ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను త‌మిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళంలోనూ విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇంకా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌లేదు మేక‌ర్స్. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ ఆస్కార్ ప‌నుల కోసం షూటింగ్ బ్రేక్ తీసుకోవ‌డంతో, ఇండియ‌న్‌2 మీద కాన్‌సెన్‌ట్రేట్ చేశారు శంక‌ర్‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.