English | Telugu

మరో క్రేజీ మల్టీస్టారర్ లో జూనియర్ ఎన్టీఆర్!

అప్పట్లో స్టార్ హీరోలు ఎలాంటి భేషజాలకు పోకుండా ఇతర స్టార్స్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దిగ్గజ నటులు ఎన్నో మల్టీస్టారర్స్ లో నటించారు. అయితే ఈ తరం స్టార్స్ మాత్రం మల్టీస్టారర్స్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఏదో ఒకటి అరా వస్తున్నాయంతే. స్టార్ డమ్ ని, ఫ్యాన్ వార్స్ ని దృష్టిలో పెట్టుకొని చాలామంది స్టార్స్ మల్టీస్టారర్స్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అయితే ఈ తరంలో గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. ఇలాంటి లెక్కలు వేసుకోకుండా మల్టీస్టారర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ తెరను పంచుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. ఓ వైపు సోలో హీరోగా భారీ ప్రాజెక్ట్ లు చేస్తూనే, మరోవైపు బడా మల్టీస్టారర్స్ లోనూ భాగమవుతున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ లో హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2'లో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ యూనివర్స్ గా పేరు తెచ్చుకున్న దానిలో ఎన్టీఆర్ భాగమవుతుండటం ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది. ఇదిలా ఉంటే మరో క్రేజీ మల్టీస్టారర్ లోనూ ఎన్టీఆర్ భాగం కానున్నాడని తెలుస్తోంది. సౌత్ స్టార్ ని, నార్త్ స్టార్ ని కలుపుతూ తీయనున్న మరో భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ కోసం అవకాశం ఎన్టీఆర్ ని వెతుక్కుంటూ వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో ఓ బాలీవుడ్ బడా స్టార్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ పంచుకోనున్నాడట. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ నిర్మించనుందని వినికిడి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే నటుడిగా సంతృత్తినిచ్ఛే పాత్రలు చేస్తూనే, పాన్ ఇండియా ఇమేజ్ ని మరింత పెంచుకునే సినిమాలు చేస్తూ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు అనిపిస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.