English | Telugu

కళ్ళు చెదిరేలా 'ఏజెంట్' ప్రీ రిలీజ్ బిజినెస్!

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్ కాగా.. మమ్ముట్టి, డినో మోరియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడి, ఆలస్యంగా విడుదలవుతున్నా.. రికార్డు స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగడం ఆశ్చర్యపరుస్తోంది.

ఏజెంట్ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.36 కోట్లని తెలుస్తోంది. ఓ యంగ్ హీరో సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం విశేషమే. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ పై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆయన మొదటి సినిమా 'అఖిల్' ఏకంగా 40 కోట్లకు పైగా బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ రెండో సినిమా 'హలో' కూడా 30 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. రెండో సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో.. తరువాతి రెండు సినిమాలు 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేశాయి. అయితే ఇప్పుడు తన ఐదో సినిమా 'ఏజెంట్' బిజినెస్ తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు అఖిల్. ఈ సినిమా పలుసార్లు వాయిదా పడినా, మొదట్లో ఉన్నంత బజ్ ఇప్పుడు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. 36 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో 10 కోట్లు, సీడెడ్ లో 4.50 కోట్లు, ఆంధ్రాలో 14.80 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో 29.30 కోట్ల బిజినెస్ చేసిన ఏజెంట్.. రెస్టాఫ్ ఇండియా 3.80 కోట్లు, ఓవర్సీస్ లో 3.10 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.36.20 కోట్లు బిజినెస్ చేసింది. 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ఏజెంట్.. అఖిల్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.