English | Telugu

శ్రీలంకలో జరిగిన దగ్గుబాటి అభిరామ్‌-ప్రత్యూషల డెస్టినేషన్‌ వెడ్డింగ్‌!

యంగ్‌ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవల వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అభిరామ్‌ ఓ ఇంటివాడయ్యాడు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు రెండో తనయుడు అభిరామ్‌-ప్రత్యూషల వివాహం డిసెంబర్‌ 6 సాయంత్రం గం.8.50లకు జరిగింది. శ్రీలంకలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో ప్రత్యూష మెడలో మూడు ముళ్లు వేశారు అభిరామ్‌. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ మూడు రోజుల పాటు జరిగింది. ఇక వీరి మ్యారేజ్‌ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్‌, సినీ ప్రముఖులు అభిరామ్‌-ప్రత్యూష దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మూవీ మొఘల్‌ డా. డి.రామానాయుడు తనయులు సురేష్‌బాబు, వెంకటేష్‌. సురేష్‌బాబు నిర్మాత ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు. ఇక వెంకటేష్‌ గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇక సురేష్‌బాబు పెద్ద కుమారుడైన రానా హీరోగా, విలన్‌గా పలు విభిన్నమైన క్యారెక్టర్స్‌ చేస్తూ తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. చిన్న కుమారుడు అభిరామ్‌ మంచి నటుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘అహింస’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. మొదటి సినిమా నిరాశ పరచడంతో తన నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రయత్నాలను ప్రస్తుతానికి విరమించారని తెలుస్తోంది. వివాహం తర్వాత తన నెక్స్‌ట్‌ సినిమాను ఎనౌన్స్‌ చేసే అవకాశం ఉందట.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.