English | Telugu

నిన్న సమ్మర్‌లో జరిగిందే.. రేపు వినాయక చవితికి కూడా జరగబోతోంది

సాధారణంగా ఏ సినిమా అయినా సీజన్‌ చూసుకొని రిలీజ్‌ చేస్తారు. రిలీజ్‌ టైమ్‌, అకేషన్‌ ఏం వుంది? థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే ఛాన్స్‌ ఉందా? అనేది ఆలోచించి రిలీజ్‌ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈమధ్య అలా జరగడం లేదు. మంచి సీజన్‌ ఉన్నా దాన్ని పట్టించుకోవడం లేదు. నిన్న సమ్మర్‌లో అదే జరిగింది. సమ్మర్‌ సీజన్‌లో టాలీవుడ్‌లో భారీ సినిమా ఒక్కటీ రిలీజ్‌ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్‌ అవుతోంది. రాబోయే వినాయక చవితి పండగకి రామ్‌, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందిన ‘స్కంద’ రిలీజ్‌ అవుతుందని మొదట ప్రకటించారు. సెప్టెంబర్‌ 15న ఈ సినిమా రిలీజ్‌ అవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సెప్టెంబర్‌ 28కి వాయిదా వేశారు. అంటే పండగ అయిపోయిన 10 రోజులకు ఈ సినిమా రిలీజ్‌ అవుతోంది. ఇదే సీజన్‌లో సెప్టెంబర్‌ 28న ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సలార్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం రిలీజ్‌ని కూడా వాయిదా వేశారు. నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంటే ఈ వినాయక చవితికి ముందుగానీ, తర్వాతగానీ భారీ తెలుగు సినిమా ఏదీ రిలీజ్‌ అవ్వడం లేదన్నమాట. అది డబ్బింగ్‌ సినిమాలకు అడ్వాంటేజ్‌గా మారింది. లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘చంద్రముఖి2’ సెప్టెంబర్‌ 15న పండగ సినిమాగా విడుదలవుతోంది. దీనితోపాటు విశాల్‌ హీరోగా రూపొందిన డిఫరెంట్‌ జోనర్‌ మూవీ ‘మార్క్‌ ఆంటోని’ రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమాలో దర్శకుడు ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషించాడు. ఏది ఏమైనా టాలీవుడ్‌ సినిమాలకు సంబంధించి ఈ సంవత్సరం రెండు సీజన్లు ఖాళీ అయిపోయి డబ్బింగ్‌ సినిమాలకు ప్లస్‌ అయింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.