English | Telugu

డిజాస్టర్ కా బాప్ 'గాండీవధారి అర్జున'.. ఇంత నష్టమంటే మాటలా.. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి ఈ మధ్య టైం అస్సలు బాగుండడం లేదు. 'గద్దలకొండ గణేశ్' వంటి హిట్ మూవీ తరువాత తన నుంచి వచ్చిన 'గని' బాక్సాఫీస్ ముంగిట తుస్సుమంది. ఇక విక్టరీ వెంకటేశ్ తో చేసిన 'ఎఫ్ 3' కూడా.. 'ఎఫ్ 2' లాగా మ్యాజిక్ చేయలేకపోయింది. దాంతో సోసో రిజల్ట్ చూసిందీ సదరు సీక్వెల్. ఇక వరుణ్ లేటెస్ట్ మూవీ 'గాండీవధారి అర్జున' ఫలితమైతే దారుణాతి దారుణంగా ఉందనే చెప్పాలి.

ఆగస్టు 25న 'బెదురులంక 2012'తో పాటు రిలీజైన 'గాండీవధారి అర్జున'.. తొలి రోజు నుంచే వసూళ్ళ పరంగా నిరాశపరుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. తొలి వారాంతంలో వచ్చే శని, ఆది వారాల్లో సైతం మెరుపులు చూపించలేకపోయింది. రూ. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ తో బరిలోకి దిగిన 'గాండీవధారి అర్జున'.. ఓవరాల్ గా రూ. 1.5 కోట్ల షేర్ మాత్రమే ఆర్జించింది. ఫైనల్ గా.. రూ. 16. 5 కోట్ల నష్టం చూసింది. ఏదేమైనా 10 శాతం రికవరీ కూడా లేకుండా.. ఇంత నష్టమంటే మాటలు కాదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి.. రాబోయే చిత్రాలతోనైనా వరుణ్ తేజ్.. మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.