English | Telugu

ఇది బాబు బాక్సాఫీస్ స్టామినా.. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల ఊచకోతే!

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ మూవీ డివైడ్ సొంతం చేసుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ మూవీ.. ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.38.88 కోట్ల షేర్, రెండో రోజు రూ.8.57 కోట్ల షేర్, మూడో రోజు రూ.9.01 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.9.47 కోట్ల షేర్ రాబట్టిన గుంటూరు కారం.. నాలుగు రోజుల్లో రూ.65.93 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఏరియాల వారీగా చూస్తే నాలుగు రోజుల్లో నైజాంలో రూ.28.25 కోట్ల షేర్ , సీడెడ్ లో రూ.7.28 కోట్ల షేర్ , ఆంధ్రాలో రూ.30.40 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.5.30 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.13.15 కోట్ల షేర్ కలిపి.. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.84.38 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

రూ.132 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గుంటూరు కారం.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.52.03 కోట్ల షేర్, రెండో రోజు రూ.11.12 కోట్ల షేర్, మూడో రోజు రూ.10.86 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.10.37 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.48 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. నేటితో సంక్రాంతి సెలవలు ముగుస్తుండటంతో మరో రూ.20 కోట్ల దాకా షేర్ సాధించే అవకాశముంది. అంటే ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయనుంది. ఒక రీజినల్ సినిమా.. అందునా డివైడ్ టాక్ తో ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం మహేష్ బాబుకే సాధ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

'గుంటూరు కారం' మూవీ 4 రోజుల వసూళ్లు:
నైజాం: రూ.28.25 కోట్ల షేర్
సీడెడ్: రూ.7.28 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.30.40 కోట్ల షేర్

తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.65.93 కోట్ల షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: రూ.5.30కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.13.15 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల వసూళ్లు: రూ.84.38 కోట్ల షేర్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.