English | Telugu

అజిత్ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌!

అజిత్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే గుడ్ న్యూసే! మార్చి మొద‌టి వారంలో అజిత్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌గిళ్ తిరుమేని ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను అంత‌లోపే కంప్లీట్ చేస్తాన‌ని మాటిచ్చేశార‌ట‌. జూన్ ఎండింగ్‌, జులై ఫ‌స్ట్ వీక్‌కి షూటింగ్ పార్టు కంప్లీట్ చేసేయ‌వ‌చ్చ‌ని పేప‌ర్ మీద లెక్క‌లు కూడా వేసి చూపించార‌ట‌. త‌క్కువ లొకేష‌న్ల‌లో, యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నార‌ట మ‌గిళ్ తిరుమేని. జులైకి షూటింగ్ పూర్త‌యితే, నిర‌భ్యంత‌రంగా దీపావ‌ళి రేసులో అజిత్ మూవీని నిల‌బెట్టాల‌న్న‌ది ప్లాన్‌. హీరోయిన్‌గా మంజు వారియ‌ర్ పేరు వినిపిస్తోంది. అన్నీ ఫైన‌లైజ్ అవ్వ‌గానే ప్ర‌క‌టించాల‌న్న‌ది మేక‌ర్స్ ప్లాన్‌.

లాస్ట్ మంత్ 11న విడుద‌లైంది అజిత్ తునివు. అదే తేదీన ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించారు ద‌ళ‌ప‌తి విజ‌య్‌. ఆ సినిమా విడుద‌ల కావ‌డం, ఆ వెంట‌నే లోకేష్ క‌న‌గరాజ్ సినిమాను ప్రారంభించ‌డం కూడా పూర్త‌యింది. ఇప్పుడు కాశ్మీర్‌లో షూటింగ్‌లో ఉంది విజ‌య్ - లోకేష్ టీమ్‌. అక్టోబ‌ర్ 19న సినిమాను విడుద‌ల చేస్తామ‌ని జ‌బ‌ర్ద‌స్త్ గా అనౌన్స్ చేసేశారు లోకేష్‌. తునివు విడుద‌ల కాగానే ఫారిన్ ట్రిప్‌కి వెళ్లారు అజిత్‌. ఆయ‌న ఫ్యామిలీతో గ‌డిపిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. అజిత్ స‌తీమ‌ణి షాలిని కూడా కొన్ని ఫొటోల‌ను షేర్ చేశారు. ఇటీవ‌లే ట్రిప్ నుంచి తిరిగి వ‌చ్చారు అజిత్‌. ఆ వెంటనే మ‌గిళ్ తిరుమేనితో మీటింగ్ పెట్టి మార్చి నుంచి జులై వ‌ర‌కు టైమ్ స్పెండ్ చేస్తాన‌ని చెప్పేశార‌ట‌.

ఈ సినిమా రిలీజ్ కాగానే, ఏడాది పాటు కెరీర్‌లో బ్రేక్ తీసుకోవాల‌నుకుంటున్నార‌ట అజిత్‌. త‌న బైక్ మీద ప్ర‌పంచ ప‌ర్య‌ట‌న చేయాల‌న్న‌ది ఆయ‌న సంక‌ల్పం. ఈ ట్రిప్‌లో అజిత్‌కి మంజువారియర్ కంపెనీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. మంజు వారియ‌ర్ చాలా బాగా బైక్ డ్రైవ్ చేస్తారు. రీసెంట్‌గా బీఎండ‌బ్ల్యూ బైక్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలిచిన అజిత్‌కి కూడా థాంక్స్ చెప్పారు. వార్త‌ల్లో ఉన్న‌ట్టు అజిత్ నెక్స్ట్ సినిమాలో మంజు వారియ‌ర్ హీరోయిన్ అయితే, ఆ సినిమాను కంప్లీట్ చేయ‌గానే ఇద్ద‌రూ ట్రిప్‌కి వెళ్ల‌డం ఖాయం అన్న‌మాట‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.