English | Telugu

రితేష్ వ‌ల్ల‌నే న‌టించాల్సి వ‌చ్చిందంటున్న జెనీలియా

త‌న భ‌ర్త రితేష్ దేశ్‌ముఖ్ వ‌ల్ల‌నే మ‌ళ్లీ న‌టించాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు జెనీలియా దేశ్‌ముఖ్‌. తెలుగులో నాగ‌చైత‌న్య‌, స‌మంత న‌టించిన మ‌జిలీని మ‌రాఠీలో వేడ్ అనే పేరుతో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో రితేష్‌, జెనీలియా జంటగా న‌టించారు. రితేష్ ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. ఈ సినిమాకు చాలా మంచి స్పంద‌న వచ్చింది. జెనీలియా మాట్లాడుతూ ``వేడ్‌కి వ‌చ్చిన ఫీడ్‌బ్యాక్‌కి ఫిదా అయ్యాను. ప‌దేళ్ల బ్రేక్ త‌ర్వాత‌ నేను చేసిన సినిమా ఇది. ఇలాంటి స‌మ‌యంలో ఈ ఫీడ్‌బ్యాక్ చూసి పొంగిపోయాను. ఇప్పుడిప్పుడే ఆ భావ‌న నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నాను. కానీ వేడ్ జ‌ర్నీ జీవితాంతం గుర్తుండిపోతుంది`` అని అన్నారు.

2012లో `నా ఇష్టం`లో ఆఖ‌రిసాయి ఫుల్ ప్లెడ్జ్డ్ రోల్ చేశారు జెనీలియా. ఆ త‌ర్వాత జైహో, ఫోర్స్ 2లో కేమియో అప్పియ‌రెన్స్‌లు ఇచ్చారు. పెళ్ల‌య్యాక పిల్ల‌ల కోసం, ఫ్యామిలీ కోసం సినిమాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు. బ్రేక్ గురించి మాట్లాడుతూ ``నా కోసం, నా పిల్ల‌ల కోసం నేను బ్రేక్ తీసుకోవాల‌నుకున్నాను. నా నిర్ణ‌యాన్ని నేను గౌర‌విస్తున్నాను. గృహిణిగా, ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా ఉంటూనే, ప్రొడ‌క్షన్ హౌస్ మొద‌లుపెట్టాను. మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేశాను. నా స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాను. న‌టన‌తో పాటు సినిమా రంగంలో ఇవ‌న్నీ చేయ‌గ‌ల‌న‌ని ప్రూవ్ చేసుకున్నాను`` అని అన్నారు.

రితేష్ గురించి చెబుతూ ``వేడ్‌ని రితేష్ డైరక్ట్ చేయ‌బ‌ట్టే ఈ కేర‌క్ట‌ర్‌లో నేను చేశాను. అయినా ఇప్పుడు ఈ పాత్ర‌కు నేను అవ‌స‌ర‌మా అని కూడా రితేష్‌ని అడిగాను. ఇన్నాళ్లు నీకు న‌చ్చిన‌ట్టు ఉన్నావు. ఇప్పుడు మ‌ళ్లీ న‌టించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. చేయ‌మ‌ని అన్నారు. నాక్కూడా త‌ను చెప్పింది నిజ‌మేన‌నిపించింది. అందుకే యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకున్నాను. ఇక‌పై కూడా వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని లేదు. మంచి పాత్ర‌లు వ‌చ్చేదాకా వెయిట్ చేయ‌డానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నా టైమ్‌కి అనుకూలంగా ఉండే ప్రాజెక్టుల‌ను త‌ప్ప‌కుండా టేకప్ చేస్తాను`` అని అన్నారు జెనీలియా. త్వ‌ర‌లోనే తెలుగులో రామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు జెనీలియా. రామ్‌, జెనీలియా ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.