English | Telugu

స్టార్ హీరో సినిమా రేంజ్ లో చిన్న సినిమా కలెక్షన్స్!

చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని నమోదు చేసిన సందర్భాలు ఎన్నో చూశాము. అయితే ఒక చిన్న సినిమా, రీరిలీజ్ లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతని సాధించింది 'ఈ నగరానికి ఏమైంది?' చిత్రం.

ఈ తరం యువతని విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో 'ఈ నగరానికి ఏమైంది?' ఒకటి. 'పెళ్ళి చూపులు' తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర 'పెళ్ళి చూపులు' స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ, 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాకి ఎందరో అభిమానులున్నారు. స్మాల్ స్క్రీన్ మీద ఈ సినిమాని రిపీటెడ్ గా చూసేవాళ్ళు ఎందరో. సోషల్ మీడియాలో మీమ్స్ గాను ఈ సినిమాలో సీన్స్ ని, డైలాగ్స్ ని ఉపయోగిస్తుంటారు. అంతలా ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ లో అదిరిపోయే కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

'ఈ నగరానికి ఏమైంది?' సినిమా 2018 జూన్ 29న విడుదలైంది. ఈ జూన్ 29 తో ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా జూన్ 29న ఈ మూవీని రీరిలీజ్ చేశారు. మొదట్లో కొన్ని థియేటర్లలోనే ఈ సినిమా విడుదల చేయాలి అనుకోగా, అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన ఊహించని రెస్పాన్స్ తో షోలను పెంచేశారు. మెజారిటీ షోలు ఫుల్ అయ్యాయి. ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షోలకి గాను రూ.20 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా, రీరిలీజ్ లో మాత్రం మార్నింగ్ షోలకి ఏకంగా రూ.80 లక్షలు రాబట్టింది. ఇప్పటిదాకా రీరిలీజ్ లో మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా గ్రాస్ రాబట్టిన సినిమాలుగా పోకిరి, జల్సా, ఖుషి, ఒక్కడు, ఆరెంజ్, దేశముదురు, సింహాద్రి నిలిచాయి. ఈ ఏడు సినిమాలు కూడా స్టార్లు నటించిన సినిమాలు కావడం గమనార్హం. అయితే ఇప్పుడు వీటి సరసన ఈ నగరానికి ఏమైంది సినిమా చేరింది. ఈ మూవీ రీరిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా గ్రాస్ రాబట్టింది. ఒక చిన్న సినిమా రీరిలీజ్ లో ఈస్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.