English | Telugu

నాగ్ పై దర్శకుడి విలనిజం

కింగ్ నాగార్జునపై విలనిజం చూపించే పనిలో ఉన్నాడట డైరెక్టర్. అందుకే.. నాగ్ మనుషులను టార్గెట్ చేసుకుని హింసామార్గంలో పయనిస్తున్నాడట. ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఏమా కథ?

ఆ వివరాల్లోకి వెళితే.. నాగార్జున కథానాయకుడిగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో 'నా సామి రంగ' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాగ్ బర్త్ డే సందర్భంగా ఈ రోజు (ఆగస్టు 29) ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు కూడా. కాగా, ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ రోల్ ఉందట. ఆ పాత్రలో పలాస దర్శకుడు కరుణ కుమార్ కనిపించబోతున్నారట. తెలుగు తెరపై ఇప్పటివరకు చూపని విలనిజం.. ఈ పాత్రలో ఆవిష్కరిస్తున్నారట మేకర్స్. మరి.. పలాస దర్శకుడి విలనిజం నా సామి రంగకి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న నా సామి రంగ.. 2024 సంక్రాంతికి థియేటర్స్ లో రానుంది. బంగార్రాజు తరువాత సంక్రాంతికి వస్తున్న నాగ్ సినిమా ఇదే కావడం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.