English | Telugu

విద్యాబాలన్ కు పద్మశ్రీ అవార్డు ఏంటి ?

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు గ్రహీతలను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ విద్యాబాలన్ కి కూడా ఈ అవార్డు వచ్చింది. ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నటి, దర్శకురాలు శ్రీప్రియ తన ట్విట్టర్ ద్వారా చాలా తీవ్రంగా స్పందించారు. "సీనియర్ తారలను మర్చిపోవడం బాధాకరం. విజయ నిర్మలకు నటిగా ఎంతో గుర్తింపు ఉంది. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, గిన్నిస్ రికార్డ్ కూడా సాధించిన ఆమెకు ఇంకా "పద్మ" పురస్కారం రాకపోవడం ఏంటి? అలాగే నాటి తరం తారల్లో నటి లక్ష్మి కూడా భారతీయ భాషల్లోని పలు చిత్రాల్లో నటించిన ఆమెను గుర్తించకపోవడం ఏంటి? అని ఘాటుగా స్పందించారు. కానీ ఎన్ని సినిమాలు చేసి ఉంటుందని విద్యాబాలన్ కి పద్మ పురస్కారం కట్టబెట్టారో తనకు తెలియడం లేదని శ్రీప్రియ పేర్కొన్నారు. కమల్ హాసన్ కి పద్మభూషణ్ రావడం అంటే.. ఆయనకు ఆ అర్హత ఉంది. అది ఆనందించదగ్గ విషయం అని తెలిపింది. సీనియర్ తారలకు తగిన గుర్తింపు లభించడంలేదనే బాధతో ఈ కామెంట్లు చేశానని" ఆమె స్పష్టం చేసారు. మరి శ్రీప్రియ చెప్పిన మాటలకూ ఎవరు, ఎలా స్పందిస్తారో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .