English | Telugu

దిల్‌ రాజు వీడియో వైరల్‌... అందరూ షాక్‌.. ఇలా కూడా చేస్తాడా?

సినిమా పంపిణీ రంగంలో విశేషమైన అనుభవం గడిరచిన వెంకట రమణారెడ్డిని అందరూ ముద్దుగా రాజు అని పిలిచేవారు. డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ అయిన తర్వాత ‘దిల్‌’ చిత్రాన్ని నిర్మించి తొలి సినిమాతోనే సూపర్‌హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత దిల్‌ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకొని దిల్‌రాజుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 40 సినిమాలను నిర్మించిన దిల్‌రాజు తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే పాన్‌ ఇండియా సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. దిల్‌రాజు నిర్మాతగా విజయం సాధించడం వెనుక కొన్ని కారణాలు వున్నాయి. ప్రేక్షకుల పల్స్‌పై ఒక అవగాహన, పాటలపై మంచి పట్టు, కథను జడ్జ్‌ చేసే సామర్థ్యం.. వీటన్నింటి వల్ల అతని కెరీర్‌లో ఎక్కువ శాతం సక్సెస్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే అతనిలో మరో టాలెంట్‌ కూడా ఉందని ఓ వీడియో ద్వారా తెలిసింది. అదేమిటంటే సింగింగ్‌ టాలెంట్‌.
నాగచైతన్య హీరోగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘జోష్‌’ చిత్రంలో దిల్‌రాజు ఓ పాట పాడాడు. ఇది చాలా మంది తెలీదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికి రావడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. ఓ టీవీ ఛానల్‌ రాఘవేంద్రరావు నిర్వహించే కార్యక్రమానికి ఆమధ్య అల్లు అర్జున్‌, దిల్‌రాజు, ఛోటా కె.నాయుడు హాజరయ్యారు. ఆ సందర్భంలో ‘నువ్వు పాటలు కూడా పాడతావట కదా’ అని ప్రశ్నిస్తూ దిల్‌రాజు పాడిన పాటను స్క్రీన్‌పై వేశారు. ‘అన్నయ్యొచ్చినాడో.. వెలుగుల వెన్నెల్‌ తెచ్చినాడో’ అంటూ సాగే పాటను దిల్‌రాజు ఎంతో జోష్‌తో పాడాడు. అప్పట్లో ఆ పాట ఫేమస్‌ కూడా అయింది. అయితే అది దిల్‌రాజు పాడిన పాట అని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. చాలా కాలం తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో బయటికి రావడం వల్ల దిల్‌రాజులో ఉన్న సింగింగ్‌ టాలెంట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.