English | Telugu

భ‌య‌పెడుతున్న‌ బాహుబ‌లి

చిత్రసీమ‌లో తాడు పాముగా మారి బుస‌లు కొట్ట‌డానికి, పాము తాడుగా వాడిపోవ‌డానికి అట్టే స‌మ‌యం ప‌ట్ట‌దు. ఇప్పుడు బాహుబ‌లి కూడా అంతే. ఈ సినిమా కూడా టాలీవుడ్‌ని క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డేస్తోంది. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా ఈ సినిమా రిలీజ్ విష‌యంలో పిచ్చ క‌న్‌ఫ్చూజ‌న్‌లో ఉన్నాడు. ముందు ఈ సినిమాని ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తామ‌న్నారు. కానీ మాట త‌ప్పాడు. మే 15న ఖాయం అన్నాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఈ సినిమా విడుద‌ల తేదీ వాయిదా ప‌డింది. అంటే ఈ సినిమా విష‌యంలో రాజ‌మౌళికి అప్పుడే క‌న్‌ఫ్యూజ‌న్ మొద‌లైపోయింద‌న్న‌మాట‌. అస‌లు బాహుబ‌లి సినిమాకి బిజినెస్ జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది ఇన్‌సైడ్ టాక్‌. ప్ర‌భాస్ - రాజ‌మౌళి సినిమాల‌కు బిజినెస్‌తో ప‌నేంటి? అనుకోవ‌చ్చు. కానీ.. నిర్మాత‌లు భారీ రేట్లు చెబితే బ‌య్య‌ర్లు జ‌డుసుకోక ఏం చేస్తారు? నైజాం రూ.30 కోట్లు అడిగితే కొనే నాధుడెవ‌రు? గుంటూరు, కృష్ణ‌, ఈస్ట్‌, వెస్ట్ ఏ ఏరియా తీసుకొన్నా పాతిక కోట్ల‌కు త‌గ్గ‌డం లేదు. సినిమా ఎంత హిట్ట‌యిపోయినా.. అస‌లు సంపాదించుకోవ‌డం గ‌గ‌నం అయిపోతుంది. అందుకే బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి శాటిలైట్ జ‌ర‌గ‌లేదు. రూ.170 కోట్ల‌ని ఎలా రాబ‌ట్టుకోవాలా అని నిర్మాత‌లు చూస్తున్నారు. ఈ సినిమాకి త‌క్కువ రేట్ల‌కు ఎలా కొట్టేద్దామా అని బ‌య్య‌ర్లు చూస్తున్నారు. దాంతో బేరాలు తెగ‌డం లేదు. అందుకే రిలీజ్ డేటు వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇప్పుడు కొత్త‌గా మే 23 అంటున్నారు. అప్ప‌టికైనా వ‌స్తుందా..?? అనేది డౌటే.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.