English | Telugu

రేయ్ - షూటింగ్ ఇంకా అవ్వ‌లేదా??

వైవిఎస్ చౌద‌రి నాలుగేళ్ల నుంచీ `రేయ్‌` కోసం ఓ యుద్ధం చేస్తున్నాడు. నాలుగేళ్ల‌లో రెండేళ్లు షూటింగ్‌కే ప‌ట్టింది. ఆ త‌ర‌వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లోకి దిగాడు. అక్క‌డి నుంచీ... సినిమాని పూర్తి చేయ‌డానికి నానా పాట్లూ ప‌డ్డాడు. విడుద‌ల చేయ‌డానికి మ‌రో యుద్దం. దాదాపు విడుద‌ల తేదీ డ‌జ‌ను సార్లు వాయిదా ప‌డిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఈసారి మార్చి 27 ప‌క్కా అన్నాడు. అయితే అస‌లు విష‌యం ఏంటంటే `రేయ్` షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకో పాట బ్యాలెన్స్ ఉంది. పవ‌న్ క‌ల్యాణ్ అభిమానుల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన ప‌వ‌నిజం పాట‌ని తెర‌కెక్కించాల్సివుంది. మ‌రో రెండు రోజుల్లో షూటింగ్ మొద‌లెడ‌తాడ‌ట‌. అదెప్పుడు పూర్త‌వుతుందో? ఈనెల 27న రిలీజ్ పెట్టుకొని ఇంకా షూటింగ్ పెట్టుకొన్నాడంటే చౌద‌రి ప్లానింగ్ ఎంత అధ్వానంగా ఉందో అర్థ‌మైపోతోంది. అయినా ఈ పాట‌ని యాడ్ చేయాల‌న్న ఆలోచ‌న ఇప్ప‌టిది కాదు. ఏడాదిన్న‌ర క్రిత‌మే ఈ పాట‌ని కంపోజ్ చేశారు. అయితే.. ఈలోగా ఎందుకు తీయ‌లేక‌పోయాడో ఎవ్వ‌రికీ అర్థం కాని ప్ర‌శ్న‌. ఇన్నాళ్లూ తీయాలి అనిపించ‌ని పాట‌ని ఇప్పుడెందుకు తెర‌కెక్కించ‌బోతున్నాడు? అదీ రిలీజ్ డేట్ ముందు పెట్టుకొని?? కేవ‌లం ప‌వ‌న్ అభిమానుల కోస‌మేనా??

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.