Read more!

English | Telugu

మైత్రి సమేత కృష్ణవంశీ.. హిట్ ఖాయమేనా!

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రంగమార్తాండ'. మరాఠీ ఫిల్మ్ 'నటసామ్రాట్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హౌస్‌ఫుల్‌ మూవీస్‌, రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాని ఉగాది కానుకగా మార్చి 22న విడుదల చేస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ మద్దతు లభించడం విశేషం.

కొన్నేళ్లుగా సరైన విజయం లేని కృష్ణవంశీ కాస్త ఎక్కువ సమయం తీసుకొని 'రంగమార్తాండ' చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఫలితం పట్ల ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమలోని సన్నిహితులకు, మీడియాకి కొద్దిరోజుల ముందుగానే ప్రత్యేల షోలు వేయగా.. అద్భుతమైన స్పందన లభించింది. 'రంగమార్తాండ'తో కృష్ణవంశీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో మైత్రి బ్యానర్ కి లక్కీ హ్యాండ్ అనే పేరుంది. ఆ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలన్నీ దాదాపు విజయం సాధిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక షోలకు పాజిటివ్ టాక్ వచ్చింది.. దానికితోడు మైత్రి తోడైంది. మరి కృష్ణవంశీని చాలాకాలంగా ఊరిస్తున్న సరైన విజయం 'రంగమార్తాండ'తో వరిస్తుందేమో చూడాలి.