English | Telugu

మైత్రి సమేత కృష్ణవంశీ.. హిట్ ఖాయమేనా!

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రంగమార్తాండ'. మరాఠీ ఫిల్మ్ 'నటసామ్రాట్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హౌస్‌ఫుల్‌ మూవీస్‌, రాజ శ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాని ఉగాది కానుకగా మార్చి 22న విడుదల చేస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ మద్దతు లభించడం విశేషం.

కొన్నేళ్లుగా సరైన విజయం లేని కృష్ణవంశీ కాస్త ఎక్కువ సమయం తీసుకొని 'రంగమార్తాండ' చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఫలితం పట్ల ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమలోని సన్నిహితులకు, మీడియాకి కొద్దిరోజుల ముందుగానే ప్రత్యేల షోలు వేయగా.. అద్భుతమైన స్పందన లభించింది. 'రంగమార్తాండ'తో కృష్ణవంశీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో మైత్రి బ్యానర్ కి లక్కీ హ్యాండ్ అనే పేరుంది. ఆ బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలన్నీ దాదాపు విజయం సాధిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక షోలకు పాజిటివ్ టాక్ వచ్చింది.. దానికితోడు మైత్రి తోడైంది. మరి కృష్ణవంశీని చాలాకాలంగా ఊరిస్తున్న సరైన విజయం 'రంగమార్తాండ'తో వరిస్తుందేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .