English | Telugu
నందుతో అవికా గోర్ అగ్లీ స్టోరీ!
Updated : Nov 18, 2023
సినిమా చూపిస్త మామ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ ని నిర్మించిన లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ తో కలసి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రణవ స్వరూప్ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు.
అందరికి సుపరిచితుడైన నందు హీరోగా నటిస్తుండగా, ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకి పరిచయమై సినిమా చూపిస్త మావ లాంటి చిత్రాలతో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన అవికా గోర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా గురించి బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ కథ విభిన్నమైన పాత్రలతో ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఈరోజు టైటిల్ లాంచ్ జరగగా ఈ చిత్రానికి "అగ్లీ స్టోరీ" అని టైటిల్ ని నిర్ణయించారు. 2024 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీడియాకి తెలిపారు.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా విఠల్ కొసనం, ఎడిటర్ గా శ్రీకాంత్ పట్నాయక్.ఆర్ వ్యవహరిస్తున్నారు.