English | Telugu

'మంగళవారం' ఫస్ట్ డే కలెక్షన్స్.. వచ్చింది కొంత, రావాల్సింది కొండంత!

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' తర్వాత పాయల్, అజయ్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ మూవీలో పాయల్ బోల్డ్ పాత్ర పోషించడం అందరి దృష్టిని ఆకర్షించింది. 'మంగళవారం' నిన్న(నవంబర్ 17న) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ఉన్న అంచనాలు, పాజిటివ్ టాక్ కి తగ్గట్టుగానే మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది.

వరల్డ్ వైడ్ గా రూ.12 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన మంగళవారం.. రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. మొదటి రోజు నైజాం(తెలంగాణ)లో రూ.75 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.89 లక్షల షేర్, సీడెడ్ లో రూ.38 లక్షల షేర్ రాబట్టిన ఈ మూవీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.2.02 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.28 లక్షల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.2.30 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.10.70 కోట్ల షేర్ దాకా రాబట్టాల్సి ఉంది. కొండంత టార్గెట్ ఉన్నప్పటికీ.. మూవీకి పాజిటివ్ టాక్ రావడం, పైగా ప్రస్తుతం ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో 'మంగళవారం' ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మంగళవారం మొదటి రోజు కలెక్షన్స్:
నైజాం: రూ.75 లక్షల షేర్
ఆంధ్రా: రూ.89 లక్షల షేర్
సీడెడ్: రూ.38 లక్షల షేర్

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్: రూ.2.02 కోట్ల షేర్
రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్: రూ.28 లక్షల షేర్
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్: రూ.2.30 కోట్ల షేర్

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.