English | Telugu

పెళ్లి మీద మనసు మళ్లింది.. ప్రభాస్ తో అట్లుంటది!

'కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు' అంటారు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన అనుష్క శెట్టి.. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉందని, కానీ ఆ టైం రావాలని అంటున్నారు.

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా పి. మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ రేపు(సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పెళ్లి చేసుకోవాలనే ఉందని, కానీ అదేదో అంటారు కదా.. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అని.. ఆ టైం రావాలని అనుష్క అన్నారు.

ఇక ఈ సినిమాలో చెఫ్ పాత్ర పోషించిన అనుష్క.. తెలుగు వంటకాల్లో తనకు ముద్దపప్పు-ఆవకాయ, రొయ్యలు ఇష్టమని చెప్పారు. అయితే తాను తన ఫ్రెండ్స్ ప్రభాస్, ప్రమోద్ లాగా ఫుడీ కాదని, అయినా వారితో ఫ్రెండ్ షిప్ ఉంటే ఫుడీలు కూడా ఫుడ్ మానేస్తారు, వాళ్ళ వ్యవహారం అలా ఉంటుంది అంటూ మిర్చి షూటింగ్ టైంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మిర్చి టైంలో లావిష్ బ్రేక్ ఫాస్ట్ ఉండేది, అది అవుతుండగానే లంచ్ గురించి డిస్కషన్ జరిగేది అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి మిర్చి టైంలో అనుష్కని ప్రభాస్ ఫుడ్ తో భయపెట్టారని అర్థమవుతోంది. ఇక ప్రభాస్ తో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవడంపై స్పందించిన అనుష్క.. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎప్పుడు రెడీనే అని, కానీ సరైన స్క్రిప్ట్ దొరకాలి కదా అన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.