English | Telugu

సంగీత దర్శకుడు అనీల్ మరణం ఒక మిస్టరీ

సంగీత దర్శకుడు అనీల్ మరణం ఒక మిస్టరీ అని అంటున్నారు. వివరాల్లోకి వెళితే గతంలో వచ్చిన సూపర్ హిట్ విభిన్న కథా చిత్రం "గమ్యం", "కళావర్ కింగ్" వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన యువ సంగీత దర్శకుడు అనీల్ తన వివాహానికి ఒక వారం పది రోజులు ముందుగా హఠాన్మరణం పాలయిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. అంతా అప్పుడు అది గుమడెపోటుతో అనీల్‍ అకాలమరణం చెందాడనుకున్నారు. కానీ అది నిజం కాదనీ, అనీల్‍ ది సహజ మరణం కాదనీ, అనీల్ బలవన్మరణం పాలయ్యాడని ఈ మధ్య పరిస్థితులను చూస్తే అనుకోవాల్సి వస్తూంది. అనీల్ కి కాబోయే భార్య షాలిని, ఆమె తల్లీ అనీల్ మరణం తర్వాత అనీల్ ఇంటి వారికి చేరువై, అనీల్ గదిలో వెతుకుతూండటం చూసిన అనీల్ సోదరి ఈ విషయాన్ని అనీల్ అన్నయ్యతో చెప్పింది. ఇది గమనించిన అనీల్ సోదరుడు రహస్యంగా షాలిని వాళ్ళ అపార్ట్ మెంటు వద్ద విచారించాడు.

అప్పుడు వెలుగు చూసిన వాస్తవాలకు షాలినీ, ఆమె తల్లీ చెపుతున్న మాటలకూ పొంతన లేకపోవటంతో, అనీల్ శవాన్ని సమాధి నుండి బయటకు తీసి పోస్ట్ మార్టమ్ కు పంపారు. అప్పుడు అనీల్ కు తలపై గాయముందని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ రావటంతో, అనీల్ ది సహజ మరణం కాదని తేలింది. అసలు అనీల్ మరణానికి కారణాలు తెలిస్తేకానీ అతన్ని ఎవరు హత్య చేశారో తెలియదు. అప్పటివరకూ అనీల్ మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.