English | Telugu

ఇంటర్ నెట్లో మహేష్ బాబు దూకుడు ఫేక్ మ్యూజిక్

ఇంటర్ నెట్లో మహేష్ బాబు "దూకుడు" ఫేక్ మ్యూజిక్ సందడి చేస్తోంది. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, అందాల సమంత హీరోయిన్ గా, డైనమిక్ యంగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం మహేష్ బాబు "దూకుడు". ఈ చిత్రానికి మణిశర్మ చక్కని సంగీతాన్ని అందిస్తున్నారు. మహేష్ బాబు "దూకుడు" చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వెనువెంటనే జరుగుతున్నాయి.

అయితే ఈ మధ్య ఇంటర్ నేట్లో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "దుకుడు" చిత్రంలోని పాటలంటూ ఫేక్ మ్యూజిక్ వినపడుతూండటంతో, ఈ చిత్రం యూనిట్ ఆ విషయంపై మిడియాకు క్లారిటీనిచ్చింది. మహేష్ బాబు "దూకుడు" చిత్రం ఆడియో ఆగస్ట్ తొలివారంలో విడుదల చేయనున్నామనీ, ప్రస్తుతం మహేష్ బాబు "దూకుడు"పాటలుగా ఇంటర్ నెట్లో వినపడేవి అసలు పాటలు కావనీ, అది ఫేక్ మ్యూజిక్ అనీ వారంటున్నారు. ఈ మహేష్ బాబు "దూకుడు" చిత్రం ఆగస్ట్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.