English | Telugu

లండన్ ఐ దగ్గర జరిగేది స్కాం గేమ్..బి అలెర్ట్ అన్న శ్యామల

యాంకర్ శ్యామల గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బుల్లితెర మీద చలాకీ మాటలతో ఆకట్టుకుంటూనే యాంకరింగ్ చేస్తుంది. అటు సీరియల్స్ లో ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమె లండన్ లో విహరించడానికి వెళ్ళింది. అలా లండన్ లో జరిగే విషయాలను వీడియోస్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్ లోడ్ చేస్తూ ఉంది. ఐతే లండన్ లో ఏమేం ఉంటాయి అనే విషయాలు నార్మల్ పీపుల్ కి తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం శ్యామల ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటుంది. లండన్ ఐ ఏరియాలో ఉండి అక్కడే ఒక వీడియో చేసింది. అదేంటంటే ఆ లండన్ ఐ ప్లేస్ మొత్తం కూడా చాలా మంది టూరిస్టులతో నిండిపోయి కనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ కొంతమంది ఆ బ్రిడ్జి మీద ఒక మ్యాట్ వేసుకుని దాని మీద మూడు గ్లాసులు పెట్టి దాని కింద ఒక బాల్ పెట్టి గేమ్ ఆడతారు. అచ్చంగా ఎలా అంటే మన ఊళ్ళల్లో, పల్లెటూళ్లలో కాయ్ రాజా కాయ్ పేరుతో ఆడుతూ ఉంటారు కదా సేమ్ అలాగే అన్నమాట.

ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఈ గేమ్ ఆడేవాడు, పక్కన ఉండి ఆడించేవాడు అందరూ వాళ్లకు సంబందించిన వాళ్ళే ఉంటారట. బయటవాళ్ళెవరూ ఉండరు. అంతా కూడా ఒక టీంగా ఫార్మ్ ఐపోయి టూరిస్టుల అటెంషన్ ని తమ వైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కాయ్ రాజా కాయ్ గేమ్. ఐతే టూరిస్టులకు ఇవన్నీ తెలీక డబ్బులు కాస్తూ ఉంటారు. కానీ అలా డబ్బులు కాస్తే మాత్రం బొక్కే కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని అక్కడ జరిగే విషయాన్నీ వీడియో తీసి అప్ లోడ్ చేసి అక్కడికి వెళ్లే టూరిస్టులను అలెర్ట్ చేసింది. ఇక ఈమె పోస్ట్ చేసిన వీడియోకి కామెంట్స్ వెల్లువెత్తాయి. "చాలా త్వరగా ఈ స్కాం గేమ్స్ ని పసిగట్టి అలెర్ట్ చేశారు. పాపం ఇవన్నీ తెలీక చాలా మంది టూరిస్టులు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. మీరు విరూపాక్ష మూవీలో సూపర్ గా చేశారు" అని అన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా లండన్ వెళ్లిన శ్యామల అక్కడి విషయాలను తన ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.